BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, August 23, 2018

"బతుకుతెరువు కోసం వచ్చిన అమాయకురాలిని బజారుకీడ్చాలనుకున్న దుర్మార్గపర్వం"

"బతుకుతెరువు కోసం వచ్చిన అమాయకురాలిని బజారుకీడ్చాలనుకున్న దుర్మార్గపర్వం"


( ఫేస్ బుక్ లో జర్నలిష్ట్ కలం నుండి వస్తోన్న నిజాల సమాహారం  ఉన్నది ఉన్నట్టూగా..)

హర్ష,విప్లవ ఇద్దరూ కలిసి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా శిశిరకు గుండెల్లో సుడిగుండాలు తిరుగుతూనే ఉన్నాయి. తండ్రి తన వల్లే చనిపోయాడని నిజం తెల్సుకున్ననాటి నుంచి అసలు బతకటమే వ్యర్ధంగా అన్పిస్తోంది. కానీ తాను తనువు చాలిస్తే సహస్ర అనాధ అవుతుంది. ఇప్పటి వరకు చేసిన పాపాలు చాలక, మరో మహా పాతకం చేసినట్లు ఉంటుంది. రాత్రులన్నీ తన కన్నీళ్లని నింపేసుకుని, పగళ్లన్నీ ఆమె తెచ్చి పెట్టుకున్న నవ్వులను తెంపేసుకుని కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఓ రోజు ఉదయాన్నే తాను హైదరాబాద్‌కు వెళ్లిపోతానని మొండిపట్టు పట్టింది. హర్ష,విప్లవ ఎంతగా సముదాయించినా వినలేదు. పోని సహస్రకు ఒక సంవత్సరం నిండే వరకు ఉండమని చెప్పినా వినలేదు. చేసేది లేక అయిష్టంగానే ఒప్పుకున్నారు. 3నెలల పసిపాపను పట్టుకుని ముగ్గురు హైదరాబాద్‌కు వచ్చారు. హర్ష,విప్లవ ప్రేమకు శిశిర పొంగిపోతోంది. తోడబుట్టినవాడు కూడా అలా చూసుకునేవాడు కాదేమో అందుకే కొన్నాళ్ల పాటు ఆర్ధికంగా అండగా ఉంటామని చెప్పేసరికి కాదనలేకపోయింది. రెండు రోజులుండి ఇద్దరూ వెళ్లిపోయారు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. మీడియాలో మంచి అవకాశాలు ఉంటాయని ఎవరో చెబితే యాంకరింగ్ కోర్స్‌ కంప్లీట్ చేసింది. చేదుగతం ప్రతిరోజు తనను తొలిచేస్తున్నా సహస్ర కోసం 
బతుకుతోంది. ఎలాగైనా సరే మంచి ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది శిశిర . శేఖర్‌ లాంటి నీచులకు బుద్ది చెప్పేలా బతకాలనుకుంది.
.......................
ఇంటికి దగ్గర్లో ఉండే బేబి కేర్‌ సెంటర్లో సహస్రను అప్పగించింది. వారికి తన జీవితాన్ని అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. సానుభూతి కోసం మాత్రం కాదు సహస్రకు నొప్పి తెలియకుండా చూసుకునేందుకు. లక్‌డీకాపూల్‌లో ఉండే ఓ కేబుల్‌ ఛానల్‌లో న్యూస్‌ రీడర్‌గా చేరింది. 2నెలలకోసారి జీతం వస్తున్నా... ముప్పావు వంతు జీతం ట్రాన్స్‌పోర్ట్‌కే పోతున్నా సరే భవిష్యత్తు కోసం వెళ్లి వచ్చేది. కొంతకాలానికే ఆఫీస్‌లో తానేంటో నిరూపించుకుంది. ఏ పని ఇచ్చినా సరే సమర్ధవంతంగా పూర్తి చేసేది. ఇంతలో ఓ టాప్‌ ఛానల్‌, న్యూస్‌ రీడర్స్‌ కోసం యాడ్‌ ఇచ్చిన విషయాన్ని చెప్పారు కొలీగ్స్. అంతటి టాప్‌ ఛానల్‌లో ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేకపోయినా,ఇంటర్వ్యూ ఫేస్ చేసిన అనుభవం వస్తుందని రెజ్యూమెతో పాటు ఫోటోస్‌ కూడా మెయిల్ చేసింది. సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ ఛానల్ హెచ్‌ ఆర్‌ కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ చేసింది. అంతే... ఉద్యోగం వచ్చినంత సంబురపడిపోయింది. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో టాప్‌ ఛానల్, అక్కడ ఉద్యోగం వస్తే నెలకు ఠంచనుగా జీతం వస్తుంది, అది కూడా మంచి జీతం. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. హర్ష,విప్లవ మోస్తున్న భారాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చు అనుకుంది. శుక్రవారం ఉదయం 11గంటలకు ఆఫీస్‌కు రమ్మని చెప్పేసరికి.... గురువారం రాత్రి నుంచి ఎప్పుడెడప్పుడు ఆ ఛానల్ ఆఫీస్‌కు వెళ్లాలా అని మగత నిద్రపోయింది. ఆ ఛానల్‌లో న్యూస్‌ రీడర్‌ గా అవకాశం ఇప్పించమంటూ శుక్రవారం ఉదయాన్నే లేచి తను నమ్మే దేవుళ్లందరికి వేల సార్లు విన్నవించుకుని జూబ్లీహిల్స్‌కు బయలు దేరింది శిశిర.
......................
క్యాబ్ దిగగానే నివ్వెరపోయింది. కార్పోరేట్ కంపెనీలను తలదన్నేలా ఉంది ఆ ఛానల్ ఆఫీస్‌. లోపలికి వెళ్లగానే విశాలమైన రిసెప్షన్‌. వెయిట్ చేయండి, కాసేపట్లో హెచ్‌ ఆర్ వద్దకు పంపిస్తాం అనే సరికి, గెస్ట్‌ల కోసమే ఏర్పాటు చేసిన లాంజ్‌లో కూర్చుని కలియదిరిగి చూసింది. ఇక్కడ ఉద్యోగం వస్తే చాలు , ఎలాగైనా కల నెరవేరేలా చేయి అని మరోసారి దేవుళ్లను మరింత బలంగా వేడుకుంది. ఇంతలోనే హెచ్‌ఆర్‌ నుంచి కాల్, శిశిర పై ఫ్లోర్‌కు వచ్చేయండి అని. కొంచెం భయం, కొంచెం బెరుకు, కొంచెం ఆనందంతో వెళ్లింది. శిశిరను చూసిన వెంటనే హెచ్‌ఆర్‌ ప్రణతి ప్లెజెంట్‌గా రిసీవ్ చేసుకుంది. ఛైర్మన్‌ గారు మిమ్మల్ని పిలిపించారు. ఆయన వేరే వారితో మాట్లాడుతున్నారు. ఫ్రీ అయిన వెంటనే ఆయన వద్దకు పంపిస్తాను.. అలా కూర్చోండి అంటూ చెప్పింది ప్రణతి. ఇంటర్వ్యూలో సెకెండ్ స్టేజ్ పాసైపోయినట్లు, ఇక ఫైనల్‌ స్టేజ్‌ కోసం.. అదే ఛైర్మన్‌ను కలిసే తరుణం కోసం వెయిట్ చేస్తోంది. తనకేం తెలుసు... వెళ్లబోయేది కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మదమృగం బోనులోకి అని. ఇంతలోనే శిశిర ప్లీజ్‌ గో అంటూ చెప్పింది ప్రణతి.....Continue

Wednesday, August 22, 2018

ఓ టీవీ చానల్ చైర్మన్ వికృత రూపం..( ఫేస్ బుక్ లో జర్నలిష్ట్ ల కలం నుండి వెలువడుతున్న వాస్తవాలు )

" ఇది కథ కాదు... ఓ కన్నీటి వ్యధ "
మమ్మీ..... నా కోసం ఏం తెచ్చావు..? 
అమ్మను చూస్తూనే పరుగెత్తుకుని వచ్చి, వచ్చీరాని మాటలతో అడిగింది సహస్ర. దుంకుతున్న అశ్రుధారలకు కట్టిన అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దారంతా బలవంతంగా దాచుకున్న గుండె కోత తన బిడ్డను చూసేసరికి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అంతే, అమాంతం సహస్రను పట్టుకుని ఏడ్చేసింది శిశిర. లెక్క వేసుకుంటే 20నిముషాలు, కొలవాలనుకుంటే లెక్కకు అందనంత భారాన్ని గుండెలో దాచుకుని అలసిపోయింది కదా, శిశిరను చూడగానే సహస్ర తట్టుకోలేకపోయింది. ఇన్నాళ్లు అడగకుండానే ఏదో ఒకటి తెచ్చి పెట్టే అమ్మ, ఇప్పుడు అడిగినా ఇవ్వకపోవటం, పైగా దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తుండటంతో మూడేళ్ల పాప కూడా తట్టుకోలేకపోయింది. పాలనురగలాంటి కళ్లు, పాలబుగ్గలు కందిపోయేలా ఏడవటం ప్రారంభించింది. కన్నపేగు గుక్కపట్టి ఏడవటాన్ని చూసి తట్టుకోలేకపోయింది శిశిర. వెంటనే తమాయించుకుంది. సారీ బేబి, సారీ తల్లి అంటూ సహస్రను బుజ్జగిస్తూ ఏడుపుకు కామా పెట్టింది. వేదనకు విరామమయితే ఇచ్చింది కానీ గడ్డ కట్టిన కన్నీటి చుక్కలు మాత్రం గుండెకోతకు సాక్ష్యాలుగా మిగిలాయి. పాపం శిశిరకు తనివితీరా ఏడ్చేందుకు కూడా స్వేచ్ఛలేదు. అచ్చంగా ఈ సమాజంలో పట్టపగలే తిరగలేని ఓ ఆడకూతురికి మల్లే........
..................
శిశిర. నెల్లూరులోని ఓ మధ్యతరగతి కుటుంబానికి గారాల పట్టి. ఆడపిల్ల పుడితే చంపేయ్యాలనుకునే మనుషులున్న ఈ జనారణ్యంలో, ఆడపిల్ల పుడితే చాలు అనుకునే మానవత్వం నడయాడే నట్టింట్లో పుట్టింది. అందుకే తల్లి గర్భం నుంచి ఈ లోకానికి పరిచయం కాగానే సంబురాలు చేసుకున్నారు. మహాలక్ష్మి పుట్టిందంటూ పండుగ చేసారు. అప్పుడు మాత్రమే కాదు శిశిరకు 23యేళ్లు వచ్చే వరకు పెళ్లిమాటే ఎత్తలేదు. చదువుకోవాలి, చదువుకొనలేని వారికి తను చదువుచెప్పించాలని ఎన్నో కలలు కన్నారు శిశిర తల్లితండ్రులు. అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది... తమ ఆశలన్నీ అడియాశలే అవుతాయ్ అని తెలిసేందుకు ఎంతో కాలం పట్టలేదు. సరిగ్గా వారం తర్వాత పిడుగులాంటి వార్త చెప్పింది. శేఖర్ లేకపోతే బతకలేను, పెళ్లంటూ చేసుకుంటే శేఖర్‌నే చేసుకుంటాను అని తెగేసి చెప్పింది శిశిర. అంతే ఎన్నో ఏళ్ల నుంచి కన్న కలలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. ఒక్కగానొక్క బిడ్డ కదా సర్ధిచెపితే వింటుందిలే అనుకుంటే, అక్కడా నిరాశే ఎదురైంది. పోనీలే అతనికే ఇచ్చి మూడు ముళ్లు వేయిద్దామనుకుంటే... నిలువెత్తు నిర్లక్ష్యానికి ప్రతిరూపం శేఖర్, ఆవారాగాళ్లకే అంబాసిడర్, వాడి నిజస్వరూపం ఇది చెప్పినా వినలేదు సరికదా ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకుని, అందరిని వదిలేసి శేఖర్‌తో వెళ్లిపోయింది. వెళ్లిపోయింది శిశిర కాదు కుటుంబపరువు అనుకున్న ఆమె తండ్రి ఉరి వేసుకుని చనిపోయాడు.
...................
నెల్లూరు టూ హైద్రాబాద్. మూసాపేట్ జంక్షన్‌కు సమీపాన ఉన్న భరత్‌నగర్లో ఒక రూమ్‌ అద్దెకు తీసుకున్నారు. శిశిర ఊహాలన్నీ ఎప్పటికి నిజం కావనే సత్యాన్ని శేఖర్ త్వరగానే బోధించాడు. తాగుడుకు బానిసయ్యాడు. శేఖర్‌ను మార్చుకునే ప్రయత్నంలోనే తాను ఒట్టిమనిషిని కాదని తెల్సుకుంది. మరికొన్ని నెలల్లో తాను మరో ప్రాణానికి ప్రాణం పోయబోతున్నానని తెలుసుకుంది. శుభవార్త విని సంతోషపడతాడనుకుంటే శేఖర్ రాక్షసుడిలా ప్రవర్తించాడు. అబార్షన్‌ చేయించుకోమని ఒత్తిడి చేసాడు.శిశిర ససేమిరా అనటంతో, గర్భిణి అని చూడకుండా చితకబాది ఎటో వెళ్లిపోయాడు. ఎంతగానో ప్రయత్నిస్తే కానీ 12 రోజుల తర్వాత శేఖర్ ఆచూకీ తెలియలేదు. తన అత్తగారింట్లోనే ఉన్నాడని తెలిసి నెల్లూరుకు బయలుదేరింది. అత్తగారింటికి వెళ్లేసరికి గేటుకు వేసిన తాళం వెక్కిరించింది. పక్కింటి వారిని ఆరా తీస్తే రేపు శేఖర్ పెళ్లి.. అందుకే అందరూ కలిసి తిరుపతి వెళ్లారనే సమాధానం వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలింది శిశిర. కాళ్లకింది భూమి కంపించినట్లైంది. నడిరోడ్డు మీదే పిచ్చిదానిలా ఏడ్చింది. పాపం ఏమైందోనని కంగారుపడిన వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. అపస్మారక స్ధితికి చేరుకునే ప్రమాదం ఉండటంతో దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
....................
మీ మానవత్వానికి సలాం సార్. సకాలంలో తీసుకొచ్చారు. మీరు స్పందించకుంటే తల్లి,బిడ్డ ఇద్దరికి ప్రమాదమై ఉండేదని చెప్పాడు డాక్టర్ హర్ష. డోంట్ వర్రీ వియ్ విల్ టేక్ కేర్‌ ఆఫ్ హర్ అంటూ అందరిని పంపించేసాడు. హర్ష ఇప్పుడు డాక్టర్ అయ్యాడు కానీ ఒకప్పుడు శిశిర క్లాస్‌మేట్. పదిమంది బావుండాలని కోరుకునే శిశిర, ఇలా అనాధగా వచ్చిందేంటని బుర్ర బ్రద్దలు కొట్టుకున్నాడు. 24గంటలు గడుస్తున్నా తన వారెవరు రాకపోవటంతో మిగతా ఫ్రెండ్స్‌కు కబురు చేసి, శిశిర ఫ్యామిలీ గురించి వాకబు చేసారు. శిశిర తండ్రి మరణంతో దిక్కు మొక్కులేనిదైన ఆమె తల్లి, నెల్లూరును వదిలి పెట్టి ఎవరో చుట్టాల వద్దకు వెళ్లిపోయిందని తెల్సింది. ఈలోపే శిశిరకు స్పృహ వచ్చిందని తెలిసి హాస్పిటల్‌కు వచ్చాడు హర్ష. శేఖర్ నమ్మకద్రోహం తెలుసుకుని చలించిపోయాడు. జీవితంతో పోరాటం ఇప్పుడే ప్రారంభమైందనే చేదు నిజాన్ని తన సహచరి విప్లవతో చెప్పించి కావాల్సినంత ధైర్యాన్ని శిశిరకు నూరిపోసాడు. అంతే కాదు సహస్ర, శిశిరను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. శిశిర ఈ లోకంలో అడుగుపెట్టే వరకు ఇద్దరిని కన్నబిడ్డలా చూసుకున్నారు.....
To b Continued...
పచ్చిబాలింత శిశిర పొట్ట చేత పట్టుకుని హైద్రాబాద్‌కు ఎందుకు వచ్చింది..?
పస్తులుండేంత అష్టకష్టాలను శిశిరఎలా అనుభవించింది..?
మీడియా మృగం బోనులోకి శిశిర ఎలా వెళ్లింది..?
రేపటి ఎపిసోడ్స్‌లో.....
( ఫేస్ బుక్ లో జర్నలిష్ట్ ల కలం నుండి వెలువడుతున్న సాక్ష్యాలు .. వారి అనుమతిలేకుండా ఏన్నోరోజుల తరువాత ఈ బ్లాగ్ లో పోష్ట్ చేస్తున్నందు కు వారు  మా " తెలుగుమీడియా న్యూస్ " టీం ను క్షమిస్తారు అని అనుకుంటున్నాం ఒకవేల ఇలా బ్లాగ్ లో పెట్టడం అబ్యంతరం అయితే మీ ఫేస్ బుక్ లో మెస్సెజ్ పెడితే కచ్చితంగా ఈ బ్లాగ్ నుండి రిమూవ్ చేస్తాము 

Wednesday, March 29, 2017

వెంకట కృష్ట కుటుంబ చానల్ Ap Times News Chanal ( Face Book News )

Note :- ఫేస్ బుక్ న్యూస్ ఎడిట్ చేయకుండా పోష్టు చేస్తున్నాం

మిత్రులందరికీ హేవిళంభానామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు...ఈ శుభదినాన మీతో ముఖ్యవిషయం పంచుకోదలిచాను..సోషల్ మీడియా లో వస్తున్న పుకార్లను నా వంతుగా ఖండించదలిచాను ..
కొత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెలువడుతోన్న ఆఫ్తిమెస్ న్యూస్ ఛానల్ అందరు అనుకుంటున్నట్లు ఎవరో భీమవరం అమలాపురం విశాఖపట్నం ఇన్వెస్టర్లు కారు.
మా సొంత కుటుంబం కలిసి తొలిసారిగా మొదలెడుతోన్న వెంచర్ ఇది నికార్సైన, విలువలతోకూడిన ఛానల్...
ఇందులో సూత్రధారులు పాత్రధారులు అందరు ఒకే కుటుంబం వారము...
నేను ఈ రోజు గర్వంగా చెపుతున్నాను ఇది మా కుటుంబపు సొంత ఛానల్...
అందరు అనుకుంటున్నట్లు ఎవరో ఇన్వెస్టర్లను వ్ఖ్ పబ్బంగడుపుకోడానికి ఇందులోకి దించలేదు. ఒక మేటి ఎడిటోరియల్ నాయకునిలా నడిపించడానికి నా వారి సాహసోపేత ప్రాజెక్ట్ ఇది... 
పూర్తి స్థాయిలో, ఒక మేటి జర్నలిస్టుగా వ్ఖ్ ని మరోసారి మనముందుకు తీసుకురాడానికి చేస్తోన్న ప్రాజెక్ట్ . ఆంధ్రప్రదేశ్ లోన్యూస్ ఛానల్ కి వున్న లోటు భర్తీచేయడానికి మేమందరం చేస్తోన్న ప్రయత్నం...
ఈ ప్రాజెక్ట్ కి అన్ని తానె అయి వెన్నంటే ఉండిపూనుకున్న అక్క బావాగారికి ఎనలేని కృతఙ్ఞతలు.. అడిగినవెంటనే అన్ని సమకూర్చగలిగిన బావ గారి మిత్రులకు బోర్డు అఫ్ డైరెక్టర్స్ కి వందనాలు...!!

ఉన్నతవిలువల తో రానున్న ఈవార్త ఝరిని మిత్రులందరూ ఆశీర్వదించి జయప్రదం చేయండి...

మీ ప్రియదర్శినీకృష్ణ


Thursday, March 16, 2017

ఆ చానల్ చైర్మన్, C,E,O పై ఫిర్యాదుల వెల్లువ..త్వరలో క్రిమినల్ కేసులు నమోదు కు యత్నం

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అరాచకాలు ఎప్పుడూ సాగవు డబ్బుంది కదాని సామాన్యుని ఇబ్బంది పెడితే కుక్క చావు తప్పదు ... ఎందరోజర్నలిష్టుల కన్నీరుకు కారనమైన ఆ చానల్ పై ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి  ..పి పిఎఫ్  కట్టకుండా .,..సాలరీ ఇవ్వకుండా ..ఇబ్బందులు పెట్టిన వైనం  సాలరీ అడగటానికి వెల్లిన జర్నలిష్టుల ను  ఓ భూతు మాట మాట్లాడి కోస్తా అన్న మాటల ఆడీయో రికార్డ్స్ అన్ని ప్రెస్ కౌన్స్లి చైర్మన్ కు  ఫిర్యాదు చేసారు ..ఇవి జరుగుతాయని  ముందుగా ఊహించిన సదరు చైర్మన్  ఆయన్ను కలిసినట్టు సమాచారం అ తరువాతి రోజు అయన్ పై ఫిర్యాదులు రావడంతో  జడ్జ్ గారు  వెంటనే విచారన జరిపిస్తాం సుమోటోగా  కేసు తీసుకుంటాం అని చెప్పినట్టు సమాచారం ఈ లోగా .. హైకోర్టు డైరెక్షన్  తో లేబర్ కోర్టులో  నలిగిపోతున్న నిజాల పై విచారన జరిపించాలని ఆయన ఆదేసించినట్టు సమాచారం    

Monday, October 17, 2016

గుర్తింపు లేని వెబ్ చానల్స్ అరాచకం... ఐడి కార్డ్ ..లోగో 2000 రూపాయలే మీడియాను అడ్డంగా అమ్మేస్తున్నారు పోలీసులు వీరిపనిపట్టండి( జర్నలిస్ట్ గ్రూప్)watsup News

 ప్రధాన పత్రిక విలేకర్లు మరియు చానల్ విలేకర్లను మినహాయించి, కొన్ని ప్రజలల్లో గుర్తింపు లేని చిన్న పెద్ద పలు పత్రికలు మరియు,టీవీ ఛానళ్ల ల్లో విలేకరి గా చేస్తున్నా నంటు వారు ఆయా సముస్థల పేరుతో  ఉన్న గుర్తింపు కార్డులను చూపిస్తూ ఆయా సముస్థలను అడ్డం పెట్టుకొని  ఆసముస్థల నుండి (ఐ డి) గుర్తింపు కార్డులను ఏర్పాటు చేసుకొని, పలు ప్రైవేటు కంపెనీలతో పాటు పాలన అధికారులను, ప్రైవెట్ డెవలప్ మెంట్ సముస్థలను,నూతన ఇంటి నిర్మాణ యాజమణులను,ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కబ్జాలు,సెటిల్ మెంట్లు, నకిలీ సర్టిఫికేట్స్,గుట్కా కంపెనీలు, ,చట్ట విరుద్దంగా రాంగ్ రూట్ ప్రయాణం,పోలీసులకు ఆదర్శంగా ఉండవలసిందిగా పోయి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనంపై ప్రయాణం   చేస్తూ విలేకరి అనే పదాన్ని పవిత్రమైన అర్ధాన్ని  అపవిత్రంతో కూని చేస్తున్నారని పలు స్వచ్ఛంద సముస్థల సర్వేలో వెలువడినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఈ గుర్తింపు లేని టీ వి ఛానెల్ తో పాటు పత్రికలల్లో విధులు నిర్వహిస్తు చాలమనిచేస్తున్న  వారిలో చాల వరకు,మొదట్లో  పలు ప్రైవేట్ కంపెనీలలో ఎల్పర్ వర్క్, బట్టల వ్యాపారం చేసేవారు,  వీరిలో ఒక్కరికి కూడా పత్రిక విలువలు తెలియవని, అంతేకాకుండా  వీరిలో ప్రస్తుతం యెవ్వరుకూడా (10వ, తరగతి ఉత్తిర్ణులయినవారు కారని) అంటున్నారు ప్రజలు. వారి పేర్లను వారికె రాసుకోరాదు ఇక ప్రజా సమస్యలపై ఏమి రాస్తారని అంటున్నారు ప్రజలు. చాలావరకు వీరంత ఇతరులపై ఆధార పడిన వారేనని అంటున్నారు ప్రజలు. ఇది నిజమని నిరూపించడానికి  ఆయా పోలీస్ అధికారులు సహకరిస్తే, ఆ సర్కిల్ పరిధిలో ఉన్న డివిజన్లలో విలేకర్లమని సంచరిస్తున్న వారికి, పోలీస్ అధికారుల  ఆధ్వరియంలో రాత పరీక్షలను నిర్వహించినట్లు అయితే  వారి అసలు స్వరూపం బట్టబైలు అవుతుంది అని అంటున్నారు కొంతమంది ప్రజా ప్రతినిధులు. ఈ కింద వెలుపరుస్తున్న చానల్స్ మరెన్నో మీడియా సముస్థలు ఉన్నాయనోచ్చు అండానికి, కేవల ఉదాహరణ మాత్రమే నాని అంటున్నాయి పలు కులసంఘాలు ,, ఎలాంటి అనుమనుతులు లేకుండా అడ్దంగా లోగొ ఒకటి క్రియే చేసుకొని ...వెబ్సీట్ లో ఫ్రీ స్ట్రీమింగ్ లో లైవ్ టివి అని చెప్పి ..ఎలాంటి అనుమతులు లేకుండా సినిమా పాటలు వెస్తూ ఇదే మా చానల్ అని నమ్మిస్తూ లోగోలు ఐడి కార్దులు అమ్మేస్తున్నారు ఇలా అమ్మి నెలలో ఓ వెబ్ చానల్ 8 లక్షలు వసూలు చేసింది ..మరో వైలు అపోలో హాస్పిటల్ దగ్గర సంత్సర  కాలగా వెలచిన ఓ వెబ్ చానల్ అక్రమగా ఐడిలు అమ్మి అందిన కాడికి డబ్బులు వసూలు చేసుకొని ఇప్పుడు ఆఫీకు తాలం వేసి పరార్ అయ్యారని సమాచారం ...జిల్లా రిపోర్ట్ లంటూ వారి వద్దనుండి లక్షలు వసూలు చేసి మరో చోట అదే వ్యక్తి ఇంకో చానల్ పేరుతో ..కొత్త లోగొలు క్రియేట్ చేసి అమ్మకానికి రెడి అవుతున్నాడు ...మరొ చానల్ ష్టార్ 9 అని అడ్డగోలుగా లోగొలు ఐడి కార్డ్ లు అమ్మి వాల్లకు  మార్కెటింగ్ అని చెబుతూ మరో ముగ్గురి జాయిన్ చేస్తే మీడబ్బులు మీకు తిరిగి ఇస్తాం అని మల్టీలెవల్  మారెక్టింగ్ చేస్తున్నారు 
Star9 tv,, కి Tv,, ఏ TV,, సిటీ విజన్ tv,, PJ న్యూస్సి,టీ కేబుల్,,  కోవా TV,, 69 TV ,, న్యూస్6, తెలంగాణ కేబుల్ త్వ్,,  తదితర చానెల్స్ లో పని చేస్తున్న వారెవరికి  చదువారిని అక్షర జ్ఞానం లేని వారు కూడా కొన్ని యాజమాన్యాలు  ఈ లాంటి వారిని ఆసరా చేసుకొని ఆయ సముస్థలు లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. ఒక్కొక్క సముస్థ యాజమాన్యం  3వేల నుండి 5వేల రూపాయల వరకు ప్రతి నెల ఒక్కొక్క విలేకరి వద్ద వసూల్ చేస్తున్నాయి. ఆఫీస్, పేపర్ బిల్లు, లోగో చార్జెస్ తదితర ఖర్చుల పేరుతో వసూల్ చేసుకొని ఈ అజ్ఞానులకు (ఐ డి) గుర్తింపు కార్డులను ఇచ్చి. విలువలను దిగజారిస్తున్నారని అంటున్నారు.ప్రజలు ప్రజాసంఘాలు. ఇలాంటి  అర్హత  లేని వారు చాల మందే ఉన్నట్లు వెలువడుతున్న ఆరోపణలు అధికంగా ఉన్నాయి కనుక మిపరిసర ప్రాంతాల్లో కనిపించి విలేకరిని అని చెప్పి భేదిరించినట్లు అయితే వెంటనే నేరుగా వచ్చి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి సహాయం పొందగలరు. అని పలు స్వచ్ఛంద సముస్థల నాయకులు,ప్రజా సంఘాల నాయకులు తెలుపుతున్నారు.( వేరే గ్రూప్ లో న్యూస్ అందరికి అన్ని గ్రూప్ లలో షేర్ చేయండి)
ఓ చీటర్ ను అరెష్ట్ చేసినప్పుడు సిసిఏస్ పోలీసులు ఫేక్ జర్నలిష్టులు ఎవరన్నా బెదిరించి డబ్బులు వసూల్ చేస్తే సమాచారం ఇవ్వమని ప్రజలను రిక్వష్ట్ చేస్తున్నారు .. ఎవరన్నా వెబ్ చానల్స్ పేరుతో మిమ్మల్ని బెదిరించి డబ్బులు వసూల్ చేస్తే సిసిఎస్ పోలీసులకు సమాచారం ఇవ్వండి 

Appeal:- It is requested to  public to be careful regarding the fake journalist/Police/PAs/PSs to Ministers,  who are trying to cheat or extort money from innocent people and to cooperate the police by giving  information regarding such fake persons.  


  Dy. Commissioner of Police,
    CCS, DD, Hyderabad City.

శాసనసభ నియోజకవర్గ కేంద్రం గా పని చేస్తున్న రిపోర్టర్ల జీవనగాధ...watsup News

జర్నలిస్టుల జీవితగాధ
మా... జర్నలిస్ట్ ల గోడు...

 శాసనసభ నియోజకవర్గ కేంద్రం  గా పని చేస్తున్న రిపోర్టర్ల జీవనగాధ...

చావలేక బతకలేక
ప్రతినిత్యం చచ్చుకుంటు
తమ మనసులు చంపుకుంటూ
పరువు కొరకు పాకులాడి
కలాన్ని నమ్ముకుంటూ
బ్రతుకు బండి నడుపుకుంటూ
సాగుతుంది మా నౌక
జర్నలిస్టు బతుకు నౌక

ఊరూరూ తిరుగుతూ
వాడ వాడ తిరుగుతూ
వార్తలన్ని సేకరించి
అందంగా తీర్చిదిద్ది
గల్లి వార్త డిల్లిదాకా
డిల్లి వార్త గల్లి దాకా
చేరదీసుకొస్తన్నా....
పర్మినెంటు లేని బతుకు

బయట జనం 
మీకేంతక్కువంటారు
మోసగాళ్ళు అంటారు
బ్లాక్ మెయిల్ అంటారు
లంచగాళ్ళు అంటారు
వైట్కాలర్ బతుకంటరు
దొరల్లాంటి దొంగలంటరు
సంపాదన మస్తంటరు

ఇంట్లో సామానంటరు
ఏమివండమంటారు
ఫీజులేవి అంటారు
రెంటేది అంటారు
పాలోడికి అంటారు
ఇంకేదేదో అంటారు
ఏంతెచ్చావంటారు
జేబులు ఖాలీ అంటే

కూలోడు నయమంటారు
కూలికి పొమ్మంటారు
సంపాదన చేతగాంది
సోకులెందుకంటారు
ఎవరికి చెప్పినా గాని
మార్పులేని మా బ్రతుకు
నవ్వులాట మన బ్రతుకు
నవ్వుకొరకే మన బ్రతుకు

నెల జీతం మాకు రాదు
రోజు రాబడి మాకు తెల్వదు
టార్గెట్ లు చేయకున్నా...
క్యాలెండర్ నింపకున్నా....
పై సార్ల మాట వినకున్నా
దళారి పనులు చేయమన్నా
పని మాని పొమ్మంటరు
ఇంట్లనే కూర్చోమంటారు

ఇదే ఇదే మా బతుకు
నిత్యం వార్తలు తీసే
సదరు జర్నలిస్టు బతుకు
నవ్వులాట మా బ్రతుకు
బ్రతుకు బండి నడపలేక
సావలేక బతకలేక
సాగుతుంది మా నౌక
జర్నలిస్టు బతుకు నౌక..
జర్నలిస్టు ల గురించి తప్పుగా  మాట్లాడే వారందరూ ఇది చదవండి 
ఫ్రెండ్స్...
ప్రవెట్ ఉద్యోగి ని  జీతమెంత అంటే..చెపుతాడు
కానీ తనను  జీతమెంత అంటే..రిపోర్టర్లు చెప్పలేరు..ఇది మన జీవితము ?
కానీ తెలియవు జర్నలిస్ట్ ల బ్రతుకులు తెలియవు మన జీవితాల కష్టాలు  

   జర్నలిస్ట్....

Tuesday, November 10, 2015

10 టివి సీనియర్ ప్రొడ్యూసర్ Putta Sreedhar వేదన

ఈ నెల 3న మా నాన్న గారికి కిమ్స్ హాస్పిటల్ లో వెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ జరిగింది 
సెలవు పెట్టి ఆ కార్యక్రమం చేస్యించి నేను 9 th న 10 టీవీ ఆఫీసు కి వెళ్ళాను 
అప్పుడు మా c . o .o గారు నన్ను పిలిచి ///కంపెనీ నీ సెలవుల వల్ల ఇబ్బంది పడుతోంది 
నువ్వు డిసైడ్ చేసుకో ...మీ నాన్న కావాలో ...ఉద్యోగం కావాలో అన్నారు 
మేము ఇంకొకళ్ళని పెట్టుకుంటాం అన్నారు 
నేను సినిమా డిపార్టుమెంటు లో సీనియర్ ప్రొడ్యూసర్ గా ఉద్యోగం చేస్తున్నాను 
నాన్న గారి సర్జరీ కి వారం సెలవు పెట్టడం తప్పా ...
మా కష్టాలు పట్టించుకోరా ...
ఇప్పటికే కాస్ట్ కటింగ్ పేరుతో మీరు 10 వేలు జీతం కోశారు 
అయినా ఛానల్ ని నమ్ముకుని మీ దగ్గరే చేస్తున్నాను 
కానీ ఇప్పుడు వారం సెలవు పెట్టాను అన్న ఒక్క సాకు తో వెళ్లి పొమ్మంటున్నారు 
10 టీవీ ప్రజల సమస్యల కోసం పోరాడుతుంది అని చెప్పుకుంటారు కదా ...అయ్యా మీ ఉద్యోగి ప్రజల్లో ఒకడు కాదా ...
మీకు నేను ఉద్యోగం లో ఉండటం ఇష్టం లేదు అని అర్థం ఐంది . ఇలా చీటికి మాటికి సాకులు వెదికి నన్ను వెల్ల గొట్టే దాక మీరు నిద్ర పోరు అని అర్థం ఐంది . 
ఒక ఉద్యోగిని వేల్లిపోమ్మనే ముందు వాడికి ఒక కుటుంబం ఉంటుందని గుర్తించండి 
మీ స్వార్ధం కోసం నన్ను వెళ్ళిపొమ్మని అంటున్నారు ...కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నా కుటుంబం పరిస్థితి ఏంటి ....మేము రోడ్ న పడతాము . కాబట్టి న ఎకౌంటు సెటిల్ చెయ్యండి ...నాకు 3 మంత్స్ శాలరీ ఇచ్చి వెల్ల కొట్టండి ...మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోండి . లేదంటే నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళని ...కోర్టు వారిని ఆశ్రయించాల్సి వస్తుంది . 
ప్రతీ ఉద్యోగి మీ దగ్గర ఉన్నాడంటే అది వాడి కుటుంబం కోసమే అన్న విషయం ఒక్కటి గుర్తించండి 
మీ చర్యల వల్ల మీ పార్టీ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో గమనించండి ...నాకు న్యాయం చెయ్యండి.. Putta Sreedhar


మీడియాలో ఉద్యోగ బద్రతలేదు ఉన్న ఉద్యోగాల్లో ప్రకటనలు తెస్తేనే శాలరీ అంటున్నారు ..10 టీవీ ప్రజల సమస్యల కోసం పోరాడుతుంది అని చెప్పుకుంటారు కదా మరి ఇదేంటి ప్రజల కోసంపోరాటాలు చేస్తాం అంటారు మరు వీళ్ళ గోడు పట్టొంచుకోరా  నాగేశ్వర్రావు  టీవీల్లో ఊకదంపుడు ఉపన్యాసలు కాదు సాటి మనిషికి సాయం చేయండి ప్లీజ్ 

Wednesday, September 30, 2015

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చామంటున్న నెక్స్ట్ డిజిటల్ శ్రీకుమార్..( http://telugutv.info )

కేబుల్ రంగంలో తొలితరం ప్రముఖులు శ్రీకుమార్. సిటీ కేబుల్ అనగానే గుర్తొచ్చే వాళ్ళలో ఆయన ముందు వరసలో ఉంటారు. శాసనసభ సభావేశాల ప్రత్యక్ష ప్రసారం మొదలుకొని కేబుల్ టీవీ చరిత్రలో అనేక మైలురాళ్ళలో ఆయన కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. రెండున్నర దశాబ్దాలకు మించిన అనుభవాన్ని రంగరించి ఇప్పుడు డిజిటైజేషన్ లోనూ విభిన్నమైన మార్గంలో తనదైన ముద్ర వేస్తున్నారు. హిందుజా గ్రూప్ వారి హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ కు తెలంగాణ, రాయలసీమ హెడ్ గా నియమితులైన కొద్ది కాలంలోనే అత్యంత ప్రాచుర్యం కల్పించటమే కాదు.. భారతదేశంలో తొలి ఒప్పందం చేయించిన ఘనత కూడా దక్కించుకున్నారు. ప్రసారాలు ప్రారంభించటంలోనూ అదే వేగం, చొరవ ప్రదర్శించారు. కార్పొరేట్ ఎమ్మెస్వోలతోబాటు స్థానికంగా కొందరు పెద్ద ఎమ్మెస్వోలు కూడా ఫీడ్ ఇస్తామంటూ చిన్న ఎమ్మెస్వోలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో విభిన్నమైన ఆఫర్స్ తో ముందుకొచ్చిన నెక్స్ట్ డిజిటల్ పనితీరుమీద, ప్రత్యేకతలమీద, అనుమానాలమీద శ్రీకుమార్ తో తెలుగుటీవీ జరిపిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు:

NXT Noida
నెక్స్ట్ డిజిటల్ కూడా ఒక రకంగా కార్పొరేట్ ఎమ్మెస్వో కదా… మిగతా కార్పొరేట్ ఎమ్మెస్వోలకూ, మీకూ తేడా ఏంటి ?
ఇది కార్పొరేట్ సంస్థ అనే మాట నిజం. అయితే మా పరిధిలో ఎమ్మెస్వోలు ఉంటారు. వాళ్ళు ఎమ్మెస్వోలుగా కొనసాగుతారు. బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకుంటారు. మా ద్వారా అదనపు సౌకర్యాలు అందుకుంటారు. అంతే తప్ప వాళ్ళ అస్తిత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని మేం మా పరిధిలోకి తీసుకోం. వాళ్ళ స్వేచ్ఛను గౌరవిస్తాం. దశాబ్దాల తరబడి వాళ్ళు నిర్మించుకుంటూ వచ్చిన కేబుల్ వ్యాపారాన్ని మేం లాక్కోవటం లేదు. వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకోవటం లేదు. వాటా అడగటం లేదు. మేం అందించే సేవలకు కనెక్షన్ కి ఇంత చొప్పున సర్వీస్ చార్జీలు తీసుకుంటున్నాం. వాళ్ళను ఎమ్మెస్వోలుగా గుర్తిస్తున్నాం. గుర్తింపును కాపాడుతున్నాం. మీరు అంటున్న కార్పొరేట్ ఎమ్మెస్వోల పరిధిలో ఫీడ్ తీసుకునే వాళ్ళు ఎమ్మెస్వోలుగా మిగలరు. అదే అసలు తేడా.

ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్ తీసున్నంతమాత్రాన ఎమ్మెస్వోలు కాకుండా పోతారా? 
అవును. టెక్నికల్ గా వాళ్లను ఎమ్మెస్వోలుగా గుర్తించే వీల్లేదు. లైసెన్స్ తీసుకున్నవాళ్ళందరూ ఎమ్మెస్వోలు కాలేరు. సొంతగా బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోగలగాలి, సొంతగా హెడ్ ఎండ్ పెట్టుకోవాలి. చందాదారుల దరఖాస్తు ఫారాలను ట్రాయ్ కి సమర్పించాలి. కాస్ నిర్వహణ వాళ్ళనుంచే జరగాలి. అప్పుడే వాళ్ళను ప్రభుత్వం డిజిటల్ ఎమ్మెస్వోలుగా గుర్తిస్తుంది.

మరి ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ సంగతేంటి ?
లైసెన్స్ తీసుకోగానే సరిపోదు. అది అమలులోకి రావాలి. అంటే సొంత హెడ్ ఎండ్ పెట్టుకోవాలి. పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకుంటే అస్తిత్వం పోయినట్టే. అప్పుడు లైసెన్స్ కూడా ఆటోమేటిక్ గా రద్దవుతుంది. ఇక ఎప్పటికీ మామూలు ఆపరేటర్ గా మిగిలిపోవాల్సి వస్తుంది. మొదటి రెండు దశల కోసం లైసెన్స్ తీసుకొని కూడా వాడుకోని వాళ్ళ లైసెన్సులు రద్దయిన సంగతి తెలుసు కదా.. ఇవీ అంతే

నెక్స్ట్ డిజిటల్ నుంచి ఫీడ్ తీసుకున్నా అదే పరిస్థితి వస్తుంది కదా?
నెక్స్ట్ డిజిటల్ అందించే సేవలు రెండు రకాలుగా ఉంటాయి. ఎమ్మెస్వోగా లైసెన్స్ తీసుకున్నవాళ్ళకు అందించే సేవలున్నాయి. లైసెన్స్ లేని వాళ్ళకు అందించే సేవలు కూడా ఉన్నాయి. లైసెన్స్ ఉన్నవాళ్ళు సొంతగా బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకోవచ్చు. వాళ్ళకు మేమిచ్చే హెడ్ ఎండ్ సొల్యూషన్ తో వాళ్ళ పంపిణీ సాగుతుంది. కాబట్టి వాళ్ళ ఎమ్మెస్వో లైసెన్స్ కు ఢోకా లేదు. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన వర్క్ షాప్ లో ప్రభుత్వ సలహాదారు కూడా అదే విషయం స్పష్టం చేశారు. ఇది అనేక రాష్ట్రాలలో డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ పొందినవారి సమక్షంలోనే జరిగింది. అన్ని అనుమానాలు నివృత్తి చేస్తూ నెక్స్ట్ డిజిటల్ కింద ఉండే ఎమ్మెస్వోల హోదాకు ఆయన వివరణ ఇచ్చారు. ఇక రెండో రకమైన సేవలు ఎమ్మెస్వో లైసెన్స్ లేనివాళ్ళకు మేమే ఎమ్మెస్వోగా ఉంటూ అందించే సేవలు.వాళ్ళు బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకునే వీలు లేదు కాబట్టి వాళ్ళకు మేమే ఫీడ్ అందిస్తాం.

NXT Pooja

ఎమ్మెస్వోల సంగతి అలా ఉంచితే…. మీ దగ్గర ఫీడ్ తీసుకునే వాళ్ళకూ, ఇతర ఎమ్మెస్వోల దగ్గర ఫీడ్ తీసుకునేవాళ్ళకూ తేడా ఏంటి ?


కచ్చితంగా తేడా ఉంది. ఎమ్మెస్వోల దగ్గర ఫీడ్ తీసుకునేవాళ్ళు ఎప్పటికీ ఎమ్మెస్వో కాలేరు. కానీ మా దగ్గర ఫీడ్ తీసుకుంటూ ఉంటే తరువాత కాలంలోనైనా వాళ్ళు ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకొని ఎమ్మెస్వో కాదలచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. అప్పుడు కూడా వాళ్ళకు మా సేవలు అవసరమవుతాయి. అప్పుడు వాళ్ళ ఒప్పందాల ప్రకారం నడుపుకుంటూ నెక్స్ట్ డిజిటల్ సేవలు అందుకుంటారు. ఆ విధంగా మేం అందించే రెండు రకాల సేవల్లో ఎవరికి అనువైనది వాళ్ళు ఎంచుకోవచ్చు.. ఎమ్మెస్వో లైసెన్స్ ఉన్నవాళ్ళకూ, లేని వాళ్ళకూ వేరువేరుగా పథకాలు రూపొందించి అందించటం మా ప్రత్యేకత.

నెక్స్ట్ డిజిటల్ ఏ విధంగా భిన్నమైనదో చెప్పండి.. అంటే మీరందించే ప్రత్యేకమైన సేవలేంటి ?
చాలా ఉన్నాయి. డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కాపాడుకోవటం, నెట్ వర్క్ మీద యాజమాన్యాన్ని నిలుపుకోవటం,సెట్ టాప్ బాక్స్ మీద యాజమాన్యం లాంటివి ముందే చెప్పాను. స్థానికంగా కేబుల్ చానల్స్ జోడించుకోవచ్చు. చందాదారు చాయిస్ కి అనుగుణంగా పాకేజీ, బిల్లింగ్ చేసుకునే స్వేచ్ఛ మా ఎమ్మెస్వోకి ఉంటుంది. ఫీడ్ కోసం ఎలాంటి బాండ్ విడ్త్ చార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. వాల్యూ యాడెడ్ సేవలు అందుకోవచ్చు. రికార్డింగ్ సౌకర్యం కూడా ఉండే ఎంపెగ్4 సెట్ టాప్ బాక్సులిస్తున్నాం. ఏడాది తరువాత కూడా సెట్ టాప్ బాక్స్ మెయింటెనెన్స్ చూస్తాం. ఒక్కో కనెక్షన్ కి మా సేవలకు గాని నిర్దిష్టమైన ఫీజు తీసుకోవటమే తప్ప ఆదాయంలో వాటా అడగం. పెద్ద ఎమ్మెస్వోలమని చెప్పుకుంటూ ఫీడ్ ఇస్తామనే వాళ్ళలాగా నెట్ వర్క్ యాజమాన్యంలో వాటా కూడా అడగం. మా అగ్రిమెంట్ చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి దాపరికాలూ, దాచుకోవటాలూ, దోచుకోవటాలూ ఉండవు.

దోచుకోవటం లేదంటున్నారు గాని మీ పరిధిలోకి చాలామంది స్వతంత్ర ఎమ్మెస్వోలు వచ్చే అవకాశముంది. అంటే వాళ్ళందరి తరఫునా మీకే క్యారేజ్ ఫీజ్ ఆదాయం వస్తుంది కదా ? 
కాదు. మాకు కారేజ్ ఫీజులో ఎలాంటి వాటా కూడా ఉండదు. ఎమ్మెస్వో అంటే ఎమ్మెస్వోనే. వాళ్ళే ఫ్రీ టు ఎయిర్ చానల్స్ నుంచి కారేజ్ ఫీజు తీసుకుంటారు. మేం తలదూర్చం. వాటా తీసుకోం. ముందు నుంచీ అదే చెబుతున్నాం. మళ్ళీ చెబుతున్నా. ఎలాంటి దాపరికాలకూ చోటు లేదు. మేం న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉంటాం. మిగతా కార్పొరేట్ ఎమ్మెస్వోలకంటే ఈ విషయంలో కూడా మేం భిన్నంగా ఉంటాం. ఇక్కడ మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. కారేజ్ ఫీజులో వాటా తీసుకోకపోవటమే కాదు, చానల్స్ తో కారేజ్ ఫీజు బేరమాడుకోవటానికి కూడా సాయం చేస్తాం. మా ఎమ్మెస్వోలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తే ఎక్కువ లాభం పొందుతారు. ఎక్కువ కారేజ్ ఫీజు వసూలు చేసుకోగలుగుతారు. అందరి తరఫునా కేబుల్ చానల్స్ నడిపి లభం పొందటానికి కూడా ఎమ్మెస్వోలను ఏకం చేస్తున్నాం. మా ఎమ్మెస్వోలు వీలైనంత ఎక్కువ లాభం పొందాలన్నదే మా లక్ష్యం.

మరి ఆపరేటర్లకు ఇన్వాయిస్ ఇచ్చేదెవరు ?
మా పరిధిలో ఉండే ఎమ్మెస్వోలకు ఆ అధికారం ఉంటుంది. ఇతర ఎమ్మెస్వోలనుంచి ఫీడ్ తీసుకునే ఎమ్మెస్వోలకు ఆ అధికారం ఉండదు. పెద్ద ఎమ్మెస్వో ఇచ్చిన ఇన్వాయిస్ లు తన ప్రాంతంలోని ఆపరేటర్లకు పంచటం వరకే అతడి పాత్ర పరిమితం. మా ఎమ్మెస్వోలకు పూర్తి స్వతంత్రత ఉంటుందనటానికి ఇది మరొక ఉదాహరణ.

ఫీడ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళను వేధిస్తున్న ఇంకో పెద్ద అనుమానం.. వాళ్ళ సొంత చానల్స్ విషయం. ఎక్కడికక్కడ సొంత చానల్స్ జోడించుకోవటం సాధ్యమేనని కొంతమంది ఎమ్మెస్వోలు చెబుతున్నారు. మీరేమంటారు ?
టెక్నికల్ గా వీలవుతుంది. కానీ డిజిటైజేషన్ చట్టం ఒప్పుకోదు. ఎక్కడికక్కడ కేబుల్ చానల్ కలుపుకోవటానికి వీల్లేదు. ఎన్ క్రిప్షన్ జరగాల్సిందే. అంటే, ఆ చానల్ ను వాళ్ళు ఫీడ్ అందుకుంటున్న ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ కి పంపి అక్కడినుంచి అన్ని చానల్స్ తోబాటే ఇది కూడా వచ్చేట్టు చూసుకోవాలి. ఫీడ్ తెచ్చుకోవటానికి బ్రాడ్ బాండ్ ఖర్చు భరించినట్టే, వాళ్ళ లోకల్ చానల్స్ కు కూడా హెడ్ ఎండ్ కు పంపుకోవటానికి ఖర్చు భరించాలి. పైగా, ఎన్ని చానల్స్ ఇస్తారనేది కూడా అనుమానమే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మీ టార్గెట్ ఎంత ఉంటుంది ?
నా పరిధిలో తెలంగాణ రాష్ట్రంతోబాటు రాయలసీమ కూడా ఉంది. కనీసం 30-35 లక్షల కనెక్షన్లకు హిట్స్ సర్వీస్ అందించాలని అనుకుంటున్నాం.

మొదటి రెండు దశల డిజిటైజేషన్ లో లేకపోవటం లోపంగా భావిస్తున్నారా?
కొంతవరకు నిజమే. మొదటి రెండు దశల్లో ఉన్న కార్పొరేట్ ఎమ్మెస్వోలు బలపడ్డారు. చిన్న ఎమ్మెస్వోలు వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయారు. ప్రారంభం నుంచి ఉండి ఉంటే మరింత మంది ఎమ్మెస్వోల స్వతంత్రతను కాపాడగలిగే వాళ్ళం. పైగా, మొదటి నుంచి ఉంటే ఈ పాటికే హిట్స్ ప్రయోజనాలు అందరికీ తెలిసి ఉండేవి కాబట్టి ప్రచారానికి ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఏమైనా, హిట్స్ అవసరం మూడు, నాలుగు దశల్లోనే ఎక్కువగా ఉందని అనుకుంటున్నాం. ఆ విధంగా చూస్తే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టే.

జైన్ హిట్స్ ప్రభావం మీమీద ఎలా ఉంది ?
జైన్ హిట్స్ ఏ విధంగానూ మాకు పోటీ కాదు. కానీ జైన్ హిట్స్ వైఫల్యం వలన మొత్తం హిట్స్ నే అనుమానించే పరిస్థితి రావటంతో నెక్స్ట్ డిజిటల్ మళ్ళీ హిట్స్ వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచే పనిలో ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. మా పాకేజీలు, లక్ష్యాలు, ఫిలాసఫీ అందరికీ అర్థమయ్యాయి. పెద్ద ఎమ్మెస్వోల ప్రతికూల ప్రచారానికి తెరపడింది. వాళ్ళు ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. ఇప్పుడు ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు హిట్స్ అనగానే హిందుజా హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ మాత్రమే అనే పరిస్థితి వచ్చింది.

చివరగా ఒక ప్రశ్న. ఇప్పుడు జరుగుతున్న డిజిటైజేషన్ పోరు అవాంఛనీయ ధోరణులకు దారితీయవచ్చుననే అనుమానాలున్నాయి. ఒక ఎమ్మెస్వో బాక్సులు మరో ఎమ్మెస్వో ఎత్తుకెళ్ళటం ద్వారా కనెక్షన్లు సొంతం చేసుకోవటానికి (భొక్ష్ శ్వప్పింగ్) ప్రయత్నాలు జరుగుతాయేమో అంటున్నారు. మీరేమంటారు ?

అనుమానాలున్నమాట నిజమే. ఊహిస్తున్న పరిస్థితేకాని ఆశిస్తున్నది మాత్రం కాదు. మొదటి రెండు దశల్లో డిజిటైజేషన్ జరిగిన చోట చందా పాకేజీలు అసంతృప్తికరంగా ఉన్నప్పుడు, ఆపరేటర్లు అసంతృప్తితో ఉన్నప్పుడు, ఎమ్మెస్వోలు నిరంకుశంగా వ్యవహరించినప్పుడు ఇటువంటి పరిస్థితికి ఆస్కారముంటుంది. అందుకే కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలు కాపాడటం కూడా ముఖ్యం. మార్కెట్ ని అలా వదిలేస్తే బలం ఉన్నవాళ్ళదే రాజ్యమవుతుంది. కార్పొరేట్ ఎమ్మెస్వోల ధాటికి చిన్న ఎమ్మెస్వోలు బలవుతారు. ఒకసారి మొదలైందంటే ఆపటం కష్టం. కానీ చందాదారుకు కూడా తెలియకుండా సర్వీస్ ప్రొవైడర్ మారిపోవటానికి వీలుకల్పించేలా సెట్ టాప్ బాక్సులు మార్చేసే ధోరణిని అడ్డుకోవటానికి ప్రభుత్వం చట్టం చేస్తుందేమో చూడాలి.


source :- http://telugutv.infoNxt Digital