BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, August 23, 2018

"బతుకుతెరువు కోసం వచ్చిన అమాయకురాలిని బజారుకీడ్చాలనుకున్న దుర్మార్గపర్వం"

"బతుకుతెరువు కోసం వచ్చిన అమాయకురాలిని బజారుకీడ్చాలనుకున్న దుర్మార్గపర్వం"


( ఫేస్ బుక్ లో జర్నలిష్ట్ కలం నుండి వస్తోన్న నిజాల సమాహారం  ఉన్నది ఉన్నట్టూగా..)

హర్ష,విప్లవ ఇద్దరూ కలిసి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా శిశిరకు గుండెల్లో సుడిగుండాలు తిరుగుతూనే ఉన్నాయి. తండ్రి తన వల్లే చనిపోయాడని నిజం తెల్సుకున్ననాటి నుంచి అసలు బతకటమే వ్యర్ధంగా అన్పిస్తోంది. కానీ తాను తనువు చాలిస్తే సహస్ర అనాధ అవుతుంది. ఇప్పటి వరకు చేసిన పాపాలు చాలక, మరో మహా పాతకం చేసినట్లు ఉంటుంది. రాత్రులన్నీ తన కన్నీళ్లని నింపేసుకుని, పగళ్లన్నీ ఆమె తెచ్చి పెట్టుకున్న నవ్వులను తెంపేసుకుని కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఓ రోజు ఉదయాన్నే తాను హైదరాబాద్‌కు వెళ్లిపోతానని మొండిపట్టు పట్టింది. హర్ష,విప్లవ ఎంతగా సముదాయించినా వినలేదు. పోని సహస్రకు ఒక సంవత్సరం నిండే వరకు ఉండమని చెప్పినా వినలేదు. చేసేది లేక అయిష్టంగానే ఒప్పుకున్నారు. 3నెలల పసిపాపను పట్టుకుని ముగ్గురు హైదరాబాద్‌కు వచ్చారు. హర్ష,విప్లవ ప్రేమకు శిశిర పొంగిపోతోంది. తోడబుట్టినవాడు కూడా అలా చూసుకునేవాడు కాదేమో అందుకే కొన్నాళ్ల పాటు ఆర్ధికంగా అండగా ఉంటామని చెప్పేసరికి కాదనలేకపోయింది. రెండు రోజులుండి ఇద్దరూ వెళ్లిపోయారు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. మీడియాలో మంచి అవకాశాలు ఉంటాయని ఎవరో చెబితే యాంకరింగ్ కోర్స్‌ కంప్లీట్ చేసింది. చేదుగతం ప్రతిరోజు తనను తొలిచేస్తున్నా సహస్ర కోసం 
బతుకుతోంది. ఎలాగైనా సరే మంచి ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది శిశిర . శేఖర్‌ లాంటి నీచులకు బుద్ది చెప్పేలా బతకాలనుకుంది.
.......................
ఇంటికి దగ్గర్లో ఉండే బేబి కేర్‌ సెంటర్లో సహస్రను అప్పగించింది. వారికి తన జీవితాన్ని అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. సానుభూతి కోసం మాత్రం కాదు సహస్రకు నొప్పి తెలియకుండా చూసుకునేందుకు. లక్‌డీకాపూల్‌లో ఉండే ఓ కేబుల్‌ ఛానల్‌లో న్యూస్‌ రీడర్‌గా చేరింది. 2నెలలకోసారి జీతం వస్తున్నా... ముప్పావు వంతు జీతం ట్రాన్స్‌పోర్ట్‌కే పోతున్నా సరే భవిష్యత్తు కోసం వెళ్లి వచ్చేది. కొంతకాలానికే ఆఫీస్‌లో తానేంటో నిరూపించుకుంది. ఏ పని ఇచ్చినా సరే సమర్ధవంతంగా పూర్తి చేసేది. ఇంతలో ఓ టాప్‌ ఛానల్‌, న్యూస్‌ రీడర్స్‌ కోసం యాడ్‌ ఇచ్చిన విషయాన్ని చెప్పారు కొలీగ్స్. అంతటి టాప్‌ ఛానల్‌లో ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేకపోయినా,ఇంటర్వ్యూ ఫేస్ చేసిన అనుభవం వస్తుందని రెజ్యూమెతో పాటు ఫోటోస్‌ కూడా మెయిల్ చేసింది. సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ ఛానల్ హెచ్‌ ఆర్‌ కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ చేసింది. అంతే... ఉద్యోగం వచ్చినంత సంబురపడిపోయింది. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో టాప్‌ ఛానల్, అక్కడ ఉద్యోగం వస్తే నెలకు ఠంచనుగా జీతం వస్తుంది, అది కూడా మంచి జీతం. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. హర్ష,విప్లవ మోస్తున్న భారాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చు అనుకుంది. శుక్రవారం ఉదయం 11గంటలకు ఆఫీస్‌కు రమ్మని చెప్పేసరికి.... గురువారం రాత్రి నుంచి ఎప్పుడెడప్పుడు ఆ ఛానల్ ఆఫీస్‌కు వెళ్లాలా అని మగత నిద్రపోయింది. ఆ ఛానల్‌లో న్యూస్‌ రీడర్‌ గా అవకాశం ఇప్పించమంటూ శుక్రవారం ఉదయాన్నే లేచి తను నమ్మే దేవుళ్లందరికి వేల సార్లు విన్నవించుకుని జూబ్లీహిల్స్‌కు బయలు దేరింది శిశిర.
......................
క్యాబ్ దిగగానే నివ్వెరపోయింది. కార్పోరేట్ కంపెనీలను తలదన్నేలా ఉంది ఆ ఛానల్ ఆఫీస్‌. లోపలికి వెళ్లగానే విశాలమైన రిసెప్షన్‌. వెయిట్ చేయండి, కాసేపట్లో హెచ్‌ ఆర్ వద్దకు పంపిస్తాం అనే సరికి, గెస్ట్‌ల కోసమే ఏర్పాటు చేసిన లాంజ్‌లో కూర్చుని కలియదిరిగి చూసింది. ఇక్కడ ఉద్యోగం వస్తే చాలు , ఎలాగైనా కల నెరవేరేలా చేయి అని మరోసారి దేవుళ్లను మరింత బలంగా వేడుకుంది. ఇంతలోనే హెచ్‌ఆర్‌ నుంచి కాల్, శిశిర పై ఫ్లోర్‌కు వచ్చేయండి అని. కొంచెం భయం, కొంచెం బెరుకు, కొంచెం ఆనందంతో వెళ్లింది. శిశిరను చూసిన వెంటనే హెచ్‌ఆర్‌ ప్రణతి ప్లెజెంట్‌గా రిసీవ్ చేసుకుంది. ఛైర్మన్‌ గారు మిమ్మల్ని పిలిపించారు. ఆయన వేరే వారితో మాట్లాడుతున్నారు. ఫ్రీ అయిన వెంటనే ఆయన వద్దకు పంపిస్తాను.. అలా కూర్చోండి అంటూ చెప్పింది ప్రణతి. ఇంటర్వ్యూలో సెకెండ్ స్టేజ్ పాసైపోయినట్లు, ఇక ఫైనల్‌ స్టేజ్‌ కోసం.. అదే ఛైర్మన్‌ను కలిసే తరుణం కోసం వెయిట్ చేస్తోంది. తనకేం తెలుసు... వెళ్లబోయేది కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మదమృగం బోనులోకి అని. ఇంతలోనే శిశిర ప్లీజ్‌ గో అంటూ చెప్పింది ప్రణతి.....Continue

Wednesday, August 22, 2018

ఓ టీవీ చానల్ చైర్మన్ వికృత రూపం..( ఫేస్ బుక్ లో జర్నలిష్ట్ ల కలం నుండి వెలువడుతున్న వాస్తవాలు )

" ఇది కథ కాదు... ఓ కన్నీటి వ్యధ "
మమ్మీ..... నా కోసం ఏం తెచ్చావు..? 
అమ్మను చూస్తూనే పరుగెత్తుకుని వచ్చి, వచ్చీరాని మాటలతో అడిగింది సహస్ర. దుంకుతున్న అశ్రుధారలకు కట్టిన అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దారంతా బలవంతంగా దాచుకున్న గుండె కోత తన బిడ్డను చూసేసరికి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అంతే, అమాంతం సహస్రను పట్టుకుని ఏడ్చేసింది శిశిర. లెక్క వేసుకుంటే 20నిముషాలు, కొలవాలనుకుంటే లెక్కకు అందనంత భారాన్ని గుండెలో దాచుకుని అలసిపోయింది కదా, శిశిరను చూడగానే సహస్ర తట్టుకోలేకపోయింది. ఇన్నాళ్లు అడగకుండానే ఏదో ఒకటి తెచ్చి పెట్టే అమ్మ, ఇప్పుడు అడిగినా ఇవ్వకపోవటం, పైగా దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తుండటంతో మూడేళ్ల పాప కూడా తట్టుకోలేకపోయింది. పాలనురగలాంటి కళ్లు, పాలబుగ్గలు కందిపోయేలా ఏడవటం ప్రారంభించింది. కన్నపేగు గుక్కపట్టి ఏడవటాన్ని చూసి తట్టుకోలేకపోయింది శిశిర. వెంటనే తమాయించుకుంది. సారీ బేబి, సారీ తల్లి అంటూ సహస్రను బుజ్జగిస్తూ ఏడుపుకు కామా పెట్టింది. వేదనకు విరామమయితే ఇచ్చింది కానీ గడ్డ కట్టిన కన్నీటి చుక్కలు మాత్రం గుండెకోతకు సాక్ష్యాలుగా మిగిలాయి. పాపం శిశిరకు తనివితీరా ఏడ్చేందుకు కూడా స్వేచ్ఛలేదు. అచ్చంగా ఈ సమాజంలో పట్టపగలే తిరగలేని ఓ ఆడకూతురికి మల్లే........
..................
శిశిర. నెల్లూరులోని ఓ మధ్యతరగతి కుటుంబానికి గారాల పట్టి. ఆడపిల్ల పుడితే చంపేయ్యాలనుకునే మనుషులున్న ఈ జనారణ్యంలో, ఆడపిల్ల పుడితే చాలు అనుకునే మానవత్వం నడయాడే నట్టింట్లో పుట్టింది. అందుకే తల్లి గర్భం నుంచి ఈ లోకానికి పరిచయం కాగానే సంబురాలు చేసుకున్నారు. మహాలక్ష్మి పుట్టిందంటూ పండుగ చేసారు. అప్పుడు మాత్రమే కాదు శిశిరకు 23యేళ్లు వచ్చే వరకు పెళ్లిమాటే ఎత్తలేదు. చదువుకోవాలి, చదువుకొనలేని వారికి తను చదువుచెప్పించాలని ఎన్నో కలలు కన్నారు శిశిర తల్లితండ్రులు. అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది... తమ ఆశలన్నీ అడియాశలే అవుతాయ్ అని తెలిసేందుకు ఎంతో కాలం పట్టలేదు. సరిగ్గా వారం తర్వాత పిడుగులాంటి వార్త చెప్పింది. శేఖర్ లేకపోతే బతకలేను, పెళ్లంటూ చేసుకుంటే శేఖర్‌నే చేసుకుంటాను అని తెగేసి చెప్పింది శిశిర. అంతే ఎన్నో ఏళ్ల నుంచి కన్న కలలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. ఒక్కగానొక్క బిడ్డ కదా సర్ధిచెపితే వింటుందిలే అనుకుంటే, అక్కడా నిరాశే ఎదురైంది. పోనీలే అతనికే ఇచ్చి మూడు ముళ్లు వేయిద్దామనుకుంటే... నిలువెత్తు నిర్లక్ష్యానికి ప్రతిరూపం శేఖర్, ఆవారాగాళ్లకే అంబాసిడర్, వాడి నిజస్వరూపం ఇది చెప్పినా వినలేదు సరికదా ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకుని, అందరిని వదిలేసి శేఖర్‌తో వెళ్లిపోయింది. వెళ్లిపోయింది శిశిర కాదు కుటుంబపరువు అనుకున్న ఆమె తండ్రి ఉరి వేసుకుని చనిపోయాడు.
...................
నెల్లూరు టూ హైద్రాబాద్. మూసాపేట్ జంక్షన్‌కు సమీపాన ఉన్న భరత్‌నగర్లో ఒక రూమ్‌ అద్దెకు తీసుకున్నారు. శిశిర ఊహాలన్నీ ఎప్పటికి నిజం కావనే సత్యాన్ని శేఖర్ త్వరగానే బోధించాడు. తాగుడుకు బానిసయ్యాడు. శేఖర్‌ను మార్చుకునే ప్రయత్నంలోనే తాను ఒట్టిమనిషిని కాదని తెల్సుకుంది. మరికొన్ని నెలల్లో తాను మరో ప్రాణానికి ప్రాణం పోయబోతున్నానని తెలుసుకుంది. శుభవార్త విని సంతోషపడతాడనుకుంటే శేఖర్ రాక్షసుడిలా ప్రవర్తించాడు. అబార్షన్‌ చేయించుకోమని ఒత్తిడి చేసాడు.శిశిర ససేమిరా అనటంతో, గర్భిణి అని చూడకుండా చితకబాది ఎటో వెళ్లిపోయాడు. ఎంతగానో ప్రయత్నిస్తే కానీ 12 రోజుల తర్వాత శేఖర్ ఆచూకీ తెలియలేదు. తన అత్తగారింట్లోనే ఉన్నాడని తెలిసి నెల్లూరుకు బయలుదేరింది. అత్తగారింటికి వెళ్లేసరికి గేటుకు వేసిన తాళం వెక్కిరించింది. పక్కింటి వారిని ఆరా తీస్తే రేపు శేఖర్ పెళ్లి.. అందుకే అందరూ కలిసి తిరుపతి వెళ్లారనే సమాధానం వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలింది శిశిర. కాళ్లకింది భూమి కంపించినట్లైంది. నడిరోడ్డు మీదే పిచ్చిదానిలా ఏడ్చింది. పాపం ఏమైందోనని కంగారుపడిన వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. అపస్మారక స్ధితికి చేరుకునే ప్రమాదం ఉండటంతో దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
....................
మీ మానవత్వానికి సలాం సార్. సకాలంలో తీసుకొచ్చారు. మీరు స్పందించకుంటే తల్లి,బిడ్డ ఇద్దరికి ప్రమాదమై ఉండేదని చెప్పాడు డాక్టర్ హర్ష. డోంట్ వర్రీ వియ్ విల్ టేక్ కేర్‌ ఆఫ్ హర్ అంటూ అందరిని పంపించేసాడు. హర్ష ఇప్పుడు డాక్టర్ అయ్యాడు కానీ ఒకప్పుడు శిశిర క్లాస్‌మేట్. పదిమంది బావుండాలని కోరుకునే శిశిర, ఇలా అనాధగా వచ్చిందేంటని బుర్ర బ్రద్దలు కొట్టుకున్నాడు. 24గంటలు గడుస్తున్నా తన వారెవరు రాకపోవటంతో మిగతా ఫ్రెండ్స్‌కు కబురు చేసి, శిశిర ఫ్యామిలీ గురించి వాకబు చేసారు. శిశిర తండ్రి మరణంతో దిక్కు మొక్కులేనిదైన ఆమె తల్లి, నెల్లూరును వదిలి పెట్టి ఎవరో చుట్టాల వద్దకు వెళ్లిపోయిందని తెల్సింది. ఈలోపే శిశిరకు స్పృహ వచ్చిందని తెలిసి హాస్పిటల్‌కు వచ్చాడు హర్ష. శేఖర్ నమ్మకద్రోహం తెలుసుకుని చలించిపోయాడు. జీవితంతో పోరాటం ఇప్పుడే ప్రారంభమైందనే చేదు నిజాన్ని తన సహచరి విప్లవతో చెప్పించి కావాల్సినంత ధైర్యాన్ని శిశిరకు నూరిపోసాడు. అంతే కాదు సహస్ర, శిశిరను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. శిశిర ఈ లోకంలో అడుగుపెట్టే వరకు ఇద్దరిని కన్నబిడ్డలా చూసుకున్నారు.....
To b Continued...
పచ్చిబాలింత శిశిర పొట్ట చేత పట్టుకుని హైద్రాబాద్‌కు ఎందుకు వచ్చింది..?
పస్తులుండేంత అష్టకష్టాలను శిశిరఎలా అనుభవించింది..?
మీడియా మృగం బోనులోకి శిశిర ఎలా వెళ్లింది..?
రేపటి ఎపిసోడ్స్‌లో.....
( ఫేస్ బుక్ లో జర్నలిష్ట్ ల కలం నుండి వెలువడుతున్న సాక్ష్యాలు .. వారి అనుమతిలేకుండా ఏన్నోరోజుల తరువాత ఈ బ్లాగ్ లో పోష్ట్ చేస్తున్నందు కు వారు  మా " తెలుగుమీడియా న్యూస్ " టీం ను క్షమిస్తారు అని అనుకుంటున్నాం ఒకవేల ఇలా బ్లాగ్ లో పెట్టడం అబ్యంతరం అయితే మీ ఫేస్ బుక్ లో మెస్సెజ్ పెడితే కచ్చితంగా ఈ బ్లాగ్ నుండి రిమూవ్ చేస్తాము