BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, May 31, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -6 --->-- నరిశెట్టి ఇన్నయ్య

ఈనాడు

రామోజీరావు ఈనాడు దినపత్రిక ప్రారంభించడానికి ముందు భిన్న కోణాలలో వ్యక్తుల్ని సంప్రదించారు. హైదరాబాదులోని ఆబిడ్స్ లో ఆయన మార్గదర్శి కార్యాలయానికి గోరా శాస్త్రిని, ఆయనతోబాటు నన్ను పిలిచారు. ఎన్నో సాయంత్రాలు అలా కూర్చొని జరిపిన సంప్రదింపులలో రామోజీరావు శ్రద్ధగా నోట్స్ తీసుకోవడం నాకు బాగా గుర్తు. అప్పుడే ఆయనకు సన్నిహితంగా వచ్చాను.
ఈనాడు దినపత్రిక ప్రారంభించినప్పుడు తొలుత వైజాగ్ నుండి వెలువడింది. అందులో ఆదివారం పత్రిక వ్యాసాలకు చలసాని ప్రసాదరావు ఇన్ ఛార్జి.
ఆయన కోరిక పై ఈనాడు ఆదివారానికి వ్యాసాలు రాశాను. 1982 వరకు అలా సాగింది. ఈనాడులో పడిన వ్యాసాలకు డబ్బిచ్చేవారు.
విజయవాడ, హైదరాబాద్ ఈనాడు వచ్చిన తరవాత కూడా నేను రాశాను. టంగుటూరి ప్రకాశంపై 1982లో నేను రాసిన వ్యాసానికి చాలా రియాక్షన్ వచ్చినట్లు గజ్జల మల్లారెడ్డి చెప్పారు. ఈనాడులో హోమియోపతీని ప్రోత్సహించడం నాకు నచ్చని విషయం. హోమియో శాస్త్రీయం కాదని రాస్తే, ప్రచురించలేదు.
రామోజీరావును తరచు ఈనాడు ఆఫీసులో కలిసేవాడిని. అలాగే చలసాని ప్రసాదరావుతో ఆయన చనిపోయేవరకూ కలిశాను. ఎడిటర్స్ గా నాకు తెలిసిన మిత్రులెందరో పని చేశారు. అయితే 1975లో నేను ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరో ఛీఫ్ అయినప్పటి నుండి ఈనాడుతో సంబంధం తగ్గింది. పొత్తూరి వెంకటేశ్వరరావు కొన్నాళ్ళు ఈనాడులో జర్నలిజం క్లాసులు నిర్వహించి, నన్ను కూడా ఆహ్వానించారు. కొన్ని ప్రసంగాలు చేశాను.
చలసాని ప్రసాదరావు నేనూ భిన్నాభిప్రాయాలతో ఉన్నా, స్నేహితులుగా చివరి వరకూ కొనసాగాం. టాపిక్ లు సూచించి రాయమనేవారు.
ఈనాడు తెలుగునాడు అని ఒక పక్షపత్రికను విదేశీ తెలుగువారి కోసం స్థాపించారు. అందులో రాజకీయ వ్యాఖ్యానం రాయమని రామారావు చెరుకూరి అడిగారు. రామోజీరావును సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న కారణంగా సాక్షి పేరిట రాశాను. సుమారు 15 సంచికలతో అది ఆగిపోయింది. విదేశీ తెలుగువారి ఆదరణ లేక ఆపేశామన్నారు. ఎం. నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ గా ఈనాడు జర్నలిజం స్కూలు క్రమపద్ధతిలో నడుస్తున్నది. అందులో కొన్ని ప్రసంగాలు చేశాను.


న్యూ హ్యూమనిస్ట్

అంబా బాపారావు చీరాల నుండి మాసపత్రికగా కొన్నేళ్శపాటు న్యూ హ్యూమనిస్ట్ నడిపారు. 1980 ప్రాంతాలలో ఈ సాహసం చేసి చేతులు కాల్చుకున్నారు. మానవ వాద సంఘానికి పత్రిక లేదనే ఉద్దేశ్యంతో నడిపారు. ఆద్యంతాలూ అన్నీ కష్టాలే. నేను అనేక వ్యాసాలు అనువాదాలు రాశాను. అగేహానంద భారతి రాసిన 'ఆకరీరొజ్' కాషాయవస్త్రం పేరిట వివాదాస్పద, ఆసక్తికర జీవిత చరిత్ర అందించాను. నరహంతకుల పేరిట ప్రపంచ క్రూర నియంతల విషయం సీరియల్ గా రాసాను. తరువాత అది గ్రంథ రూపం దాల్చింది బాపారావు ఎంత కోరుకున్నా నడపలేక ఆపేసిన మాసపత్రిక న్యూ హ్యూమనిస్ట్.
డాక్టర్ ఇన్నయ్య - రచయిత

No comments: