BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Saturday, June 11, 2011

కాలక్షేపం న్యూస్ ఛానెళ్లు...newsaa.... Gasaaaaa

ఉదయానే్న రూపాయిన్నర మొదలు మూడు రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొని ఇంకా చదువుతున్నారంటే 24 గంటలపాటు ప్రసారమయ్యే న్యూస్ ఛానళ్లపై విశ్వాసం అంతంత మాత్రంగానే ఉన్నట్టేనని లెక్క. లేకపోతే పెరిగే సాంకేతిక పరిజ్ఞానానికి ఈపాటికి ఎన్నో న్యూస్ పేపర్లు దుకాణం సర్దేయాల్సి వచ్చేది. దుకాణం సర్దేయడం మాట అటుంచి లేనిపోని కొత్త అభిమానం పుట్టుకొచ్చి పేపర్ సర్క్యులేషన్ అమాంతంగా పెరిగిపోతున్న సందర్భంలో కొన్ని పత్రికలు కూడా సొంత డబ్బానే బజాయించి నిరాశ కల్గిస్తున్నా నిజమైన వార్తాప్రియులు మాత్రం న్యూస్ ఛానళ్ల కంటే న్యూస్ పేపర్లకే తమ అభిమానాన్ని చాటడం వల్ల న్యూస్ విలువలకు ఇంకా పట్ట్భాషేకం జరుగుతూనే ఉంది.
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, టైమ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని పాఠకులు కాస్తా ప్రేక్షకులుగా మారిన సందర్భంలో న్యూస్ ఛానళ్లు ఇదంతా తమ ప్రతిభా పాఠవాలేననుకుని న్యూస్‌ని జీడిపాకంలా సాగదీయడం మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియతో నానాటికీ విసుగెత్తిపోతున్న ప్రేక్షక లోకం నెట్‌లో పత్రికలు చదవడమే మేలని భావిస్తున్నాయి. ఈ విధంగా నెట్‌లో కూడా పత్రికలకు పాఠకుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది.
వార్తల ప్రాధాన్యతా క్రమం ప్రకారం నిర్ణీత సమయంలో అవసరమైన అతి ముఖ్యమైన వార్తలే బుల్లితెర వచ్చిన కొత్తలో ప్రసారమయ్యేవి. సంక్షిప్తంగా అనవసర చర్చ లేకుండా హుందా భాషలో వార్తలు ప్రసారమయ్యేవి. ఇదంతా ప్రభుత్వ ఛానెల్ ప్రక్రియ. అది ఇప్పటికీ అదే హుందాను ప్రదర్శిస్తుంది. వార్తలను సైతం వాణిజ్యంగా మార్చేయవచ్చు అనే ప్రక్రియ తెలుగులో ఊపందుకునేసరికి దాదాపు డజను ఛానళ్లు పుట్టుకొచ్చాయి. వాటిలో వాటికే నెంబర్ వన్ స్థానం కోసం తహతహలు. దానిని నిర్ణయించే సంస్థలు రేటింగ్ ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టేసరికి వార్తా ఛానళ్ల హంగామా పనిలో పనిగా పెరిగిపోయింది.
ప్రస్తుతం ఏది వార్తో ఏది కాదో తెలియని పరిస్థితికి వార్తలను తిలకించేవారు వచ్చేశారు. దొరికిన పిసరంత వార్తకు హంగూ ఆర్భాటాలను అద్దేసి ఫలానా ఛానల్ వారి మార్కుతో మేమే మీకు ముందు అందిస్తున్నాం సుమా! అంటూ పదేపదే గుర్తు చేస్తూ వీక్షకులకు బోరెక్కించేస్తున్నారు. వార్తలో హుందాగా వినపడే భాషపోయి పరమ నీచమైన నాటు భాష, క్యాప్షన్లు న్యూస్ బులెటిన్‌లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ఛానల్స్‌లో అయితే ఏకంగా వార్తలు చదివేవారు తమ పేరు వెనుక కుల శబ్దం వినిపించేలా చెప్పుకోవడం గమనార్హం.
సమాజ బాగు కోసం వారు అందిస్తారని మనం డిసైడ్ చేసుకోవాలి. బహుశా మనకు నచ్చినవే తీసుకోవాలనేమో వారి అర్థం. ఏదైతేనేం చెప్పిందే చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి ముప్పుతిప్పలు పెట్టి అహర్నిశలు శ్రమించే ఛానల్ జర్నలిస్టుల మాటలు ప్రేక్షకులకు వార్తలను చూసేటప్పుడు ఫ్రీగా దొరికే కామెడీగా తయారయ్యింది. ‘కాదేది కవిత కనర్హం..’ అన్న శ్రీశ్రీ మాటలు నేటి ఛానళ్లకి ఆధారం, ఆదర్శం కాబోలు. అందుకే సమాజంలో దొరికే పెంట దగ్గర నుండి పెంటగాన్ వరకు దేనినీ వదలకుండా అవసరమున్నా లేకున్నా కవర్ చేసేస్తున్నాయి ఛానళ్లు.
వార్తలను యధాతథంగా అందించే రోజులు పోయాయి. దానికి కొన్ని క్లిప్పింగ్స్ (ఒక్కటి దొరికినా చాలు మసక మసకగా వున్నా ఫర్వాలేదు) మ్యూజిక్ హంగామా పెట్టేసి రాబోయే అరగంట ముందు నుండి ‘కమింగ్ అప్’ అంటూ వేసి మరీ వీక్షకుల్లో ఆసక్తి కలిగించాలి. తీరా చూస్తే తుస్సుమనేలా ఉండాలి. అవసరమైతే మరికొన్ని వార్తలను వండడం కూడా ఛానళ్లు నేర్చుకోవాలి. ఈ ప్రక్రియతో నిజాలు బయటకు లాగాలనేది ఓ టెక్నిక్. ఇలాంటి పోటీల మధ్య వార్తా ఛానళ్లు మేమే ముందు అంటే మేమే ముందు అనే తరహాలో పోటీ పడుతున్నాయి.
వార్తా ఛానళ్ల మధ్య పోటీ ఎంతగా పెరిగిపోయిందంటే ఒక ఛానల్‌ని మరో ఛానల్ అణగదొక్కే స్థాయికి వచ్చేసింది. దీనిని ఆసరాగా తీసుకుని ఒక ఛానల్ బురదజల్లిన వ్యక్తులు మరో ఛానల్‌ని వేదిక చేసుకుని తమ పాతివ్రత్యం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే సదరు ఛానల్ దానికి వత్తాసు పాడటం ఎలాంటి జర్నలిజమో వారికే తెలియాలి. ఛానళ్ల మధ్య రేటింగ్ పోటీ వారిని ఎంత వరకు తీసుకుపోతుందంటే వారి యజమానుల పర్సనల్ లైఫ్‌లోకి, వ్యాపారాల్లోకి తొంగిచూసి మరీ వెతికి బజారుకీడ్చేలా (్ఛనల్‌కి) చేస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఓ ప్రముఖ ఛానల్ మరో ప్రముఖ ఛానల్ యజమానికి సంబంధించిన హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ విశ్వసనీయతపై చర్చ పెట్టింది. చర్చా కార్యక్రమంతో ఏం సాధించిందో ఛానల్ వారికి, ప్రజలకు తెలియంది కాదు కాని చర్చకు గురైన సదరు ఛానల్ యజమాని తన ఛానల్‌లో తన ప్రొడక్ట్ గురించి టల కార్యక్రమం చేసుకోవాల్సిన పని పడింది. ఇది గమనించిన వారు ఇట్టే చెప్పేస్తారు ఇదంతా దేనికో?
వార్త చూస్తే భయం కలగడం.. చలించుకు పోవడం ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు ఆ ధోరణి ప్రజల్లో కనుమరుగై టేకిట్ ఈజీ పాలసీ వచ్చేసింది. అందుకే ఒకే రకమైన వార్తలకు కారణమయ్యే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. నిజంగా వార్త పట్ల భయం ఉంటే ఇలాంటివి జరగడానికి చాలాకాలం గ్యాప్ వచ్చేది. ఇప్పుడలా జరగడం లేదు. ప్రజలు జర్నలిస్టుల పనితీరు పట్ల ఛానల్స్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా పలు అనుమానాలను కలిగి ఉండటం జర్నలిజం చేసుకున్న పాపం. ఎవరో చేసిన దానికి అందరూ అదే తాడుకి కట్టబడటం నిజంగా దురదృష్టకరం. దీనిపై కూడా ఛానళ్లు దృష్టి పెట్టి ప్రజలను సహకరించమనడం మెచ్చుకోదగ్గ విషయం.
ఛానళ్లు అన్ని వర్గాల వారి కోసం కార్యక్రమాలను తయారుచేస్తున్నాయి. వీటిలో కొన్ని లైవ్‌గా కూడా ప్రసారవౌతున్నాయి. అయితే వాటిలో సరుకు ఎంత? అంటే మాత్రం కచ్చితంగా తక్కువనే చెప్పాలి. చర్చా కార్యక్రమం నిర్వహించేవాడు ఎవరినీ సరిగ్గా మాట్లాడనీయక పోవడం అతని నిర్వహణా దక్షతకు నిదర్శనం. చర్చా కార్యక్రమానికి ప్రతీ అంశం కూడా అర్హమే. అందుకే చర్చా కార్యక్రమాలు చూడాలంటే నేడు వీక్షకులకు బోరుగా అనిపిస్తుంది.
ఓ మూఢ నమ్మకం.. ఓ మాఫియా కథనం.. ఓ మాంచి సెక్స్ రాకెట్.. ఓ పరువు హత్య.. ఓ సినిమా గాసిప్ ఇలా దొరికిన అంశాలను దొరికినట్టు పచ్చిగా చూపించేస్తూ తమ బాధ్యతను నిలుపుకోవడంలో న్యూస్ ఛానళ్లు ‘్ఫస్ట్ ఇన్’గా ఉంటున్నాయి. ఇన్ని కబుర్లు చెప్పే ఛానళ్లు రోజులో కొన్ని గంటలపాటు విశ్వసనీయత సరిగా ఉందో లేదో తెలియని అనేక ఉత్పత్తులు, యంత్రాలను గురించి చూపడం దేనికో అర్థం కాదు.
నేడు ఎక్కువగా వార్తా ఛానళ్లు గ్లామర్ ప్రపంచం చుట్టూనే తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాయి. రోజులో దాదాపు ఐదారు గంటలు సినిమా న్యూస్‌తోనే కాలం వెళ్లదీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. హర్రిబుర్రిగా చూపే వార్తలు, అసంపూర్ణంగా పూర్తయ్యే చర్చలు, సాగదీసి సాగదీసి విసుగెత్తించే కథనాలు ప్రజల్లో ఏ వర్గానికైనా ఎంతవరకు ఉపయోగపడతాయనేది వారికే తెలియాలి. చూపించడం వరకే వారి పని అంటే.. ఓకే. ప్రతి ఛానల్ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుందనే ముద్ర ప్రజల్లో పడిపోవడం వల్ల అందులో ప్రసారమయ్యే వార్తల సారాన్ని ఇట్టే అవగాహన చేసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజల్లో వార్తా ఛానళ్ల పట్ల విశ్వసనీయత కంటే కాలక్షేప ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. కుదురుగా విశ్వసనీయతతో ఒక్క వార్తా ఛానల్‌ని కూడా చూడలేని వార్తాప్రియులు రిమోట్‌పై తరచూ వేళ్లను ఆడిస్తూ అందరికీ రేటింగ్ ఇవ్వడం కొసమెరుపు.

No comments: