BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Friday, August 12, 2011

టెలివిజన్ రేటింగ్స్ : నిజాలూ, నిష్ఠురాలూ.-(bhavanarayana.గారి విష్లేషన )



ప్రతి బుధవారం మధ్యాహ్నం కనీసం మూడు న్యూస్ చానల్స్ నుంచి మిత్రులు గడిచిన వారం రేటింగ్స్ పంఫుతుంటారు. చిత్రమేమిటంటే వాళ్ళ వాదనలకు పొంతన ఉండదు. ఎవరికి వాళ్ళు తమ మార్కెట్ వాటా ఎక్కువ ఉన్నట్టు చెప్పుకుంటారు. అదెలా సాధ్యమనేది సహజంగా ఎదురయ్యే ప్రశ్న. అసలు చిక్కు అక్కడే ఉంది. ఫలానా పట్టణాల్లో ఆ చానల్ ముందుందంటే చాలు, సంబంధిత అంకెలతో ఒక ఎస్ ఎం ఎస్. వస్తుంది. ఫలానా వయోవర్గంలో ఎక్కువ మంది ఆ చానల్ చూసినట్టు తేలితే మరో ఎస్ ఎమ్ ఎస్. వారంలో మొదటి 30 కార్యక్రమాల్లో మావే ఎక్కువ ఉన్నాయంటూ ఇంకొకరి వాదన. అందరి వాదనలూ నిజమే కావచ్చు. కానీ సామాన్యులకు ఇదొక గందరగోళం. కానీ ఫలానా చానల్ కి ఎక్కువ రేటింగ్ ఉందని చర్చించుకోవటం మాత్రం ఆగదు. చానల్ గొప్పదనానికి అదే నిదర్శనమనే అభిప్రాయం సామాన్యప్రజలకూ ఏర్పడింది. కేవలం రేటింగ్స్ ఆధారంగా చానల్ గొప్పతనాన్ని నిర్థారించటమే ఒక దారుణమైతే, అదే రేటింగ్స్ ని అన్ని చానల్స్ ఒక పౌరసంబంధాల ఆయుధంగా మలుచుకోవటం మరింత దురదృష్టకరం. ప్రకటనలు సంపాదించుకోవటానికే రేటింగ్స్ పరిమితం కావటం లేదని తేలిపోయింది.

టెలివిజన్ చానళ్ల ప్రేక్షకాదరణను అంకెల్లోకి అనువదించే ప్రక్రియగా రేటింగ్స్ ను నిర్వచించుకోవచ్చు. ప్రకటనకర్తలకు ప్రేక్షకులను సమకూర్చిపెట్టటమే చానల్స్ పని కాబట్టి వీలైనంత ఎక్కువమందిని ఆకట్టుకోగలుగుతున్నట్టు నిరూపించుకోవటం వాటి బాధ్యతగా మారింది. ఆ విధంగా మరిన్ని ప్రకటనలు తెచ్చుకోగలిగే స్థోమతను చానల్స్ చాటుకుంటున్నాయి. తమ కార్యక్రమాలకు వస్తున్న రేటింగ్స్ ను బట్టి ప్రకటనలు తెచ్చుకునే పరిస్థితి దాటిపోయింది. కేవలం రేటింగ్స్ కోసమే కార్యక్రమాలు రూపొందిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనివలన ప్రేక్షకులకు అవసరమైన కార్యక్రమాలకంటే ప్రేక్షకులు కళ్లు తిప్పుకోకుండా చూస్తారనుకునే కార్యక్రమాలమీదనే చానల్స్ దృష్టిపెడుతున్నాయి. ఈ ధోరణి మీద విమర్శలు ఏ స్థాయికి వెళ్ళాయంటే అసలు రేటింగ్స్ అనేవే ఉండకూదదనే వాదన ఇప్పుడు తెరమీదకొచ్చింది. ఇది రేటింగ్స్ తప్పా ? రేటింగ్స్ ను ఆపాదించుకోవటంలో ఉన్నతప్పా?వాటిలో శాస్త్రీయత లోపించటం తప్పా ? ఇన్ని రకాల ప్రశ్నల మధ్య ప్రభుత్వం మొదటిసారిగా రేటింగ్స్ మీద దృష్టి సారించాలనుకుంటోంది. ఒక కమిషన్ ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. అయితే ఈ రేటింగ్స్ లెక్కించే విధానం మొదలుకొని ఆపాదిస్తున్న తీరు వరకూ సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

పత్రికల సర్క్యులేషన్ నిర్థారించటానికి కచ్చితమైన లెక్కలుంటాయి.అందువలన ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ( ఎబిసి) పని చాలా సులభం. టీవీ విషయానికొచ్చేసరికి అది కుదరదు. కేవలం సర్వే పధ్ధతి మీద ఆధారపడాలి. అందుకే ఇది వివాదాస్పదంగా మారింది. పత్రికల పట్ల పాఠకుల ఆదరణలో గంటలూ రోజులూ అంతగా ముఖ్యం కాదు. ఆరు నెలలకొకసారి ఫలితాలు వస్తాయి. టీవీలకు వారానికొకసారి రేటింగ్స్ వెలువడతాయి. ఇందుకోసం ప్రతి నిమిషం చానల్స్ ను రేటింగ్స్ సంస్థ గమనిస్తూ ఉంటుంది. అందుకే ప్రతిటీవీ చానల్ క్షణ క్షణానికీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కృషి చేయాలి. లేకపోతే రిమోట్ తన పని తాను చేసుకుపోతుంది. ఒకసారి ప్రేక్షకుడు అటువైపు వెళ్ళిపోతే ఇక్కడ ఎంత మంచి కార్యక్రమం ప్రసారం చేసినా ప్రయోజనం ఉండదు. ఇటువంటి పోటీ వాతావరణంలో టీవీ రేటింగ్స్ అత్యంత సున్నితమైన అంశంగా మారిపోయాయి.

రేటింగ్స్ లెక్కించేందుకు భారతదేశంలో టామ్ ( టెలివిజన్ ఆడియెన్స్ మెజర్‍మెంట్ ) అనే సంస్థ ఉంది. నిజానికి పదేళ్ల కిందట టామ్, ఇన్‍ టామ్ అనే రెండు సమ్స్థలుండేవి. ఈ రెండూ సంస్థలూ భిన్నమైన ఫలితాలు ప్రకటిస్తూండటంతో అప్పట్లో కొంత వివాదం చెలరేగింది. అయితే, అదే సమయంలో అమెరికాలోని వీటి మాతృసంస్థలు కలిసిపోవటంతో సహజంగానే ఇక్కడ గుత్తాధిపత్యం ఏర్పడింది. ఇన్‍టామ్ మాయమైంది. ఇప్పుడు టామ్ చెప్పిందే వేదం. ప్రకటనకర్తలూ. ఏజెన్సీలూ , చానల్ యాజమాన్యాలూ తప్పనిసరిగా టామ్ సమాచారం మీదనే ఆధారపడాలి. ఇటువంటి గుత్తాధిపత్యంలో టామ్ ఎంత మేర బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నదో, ఏపాటి విశ్వసనీయత సంపాదించుకున్నదో పరిశీలించాలంటే లెక్కింపు విధానాన్నే సమీక్షించాల్సి ఉంది.

ముందే చెప్పినట్టు, రేటింగ్స్ లెక్కించటమంటే సర్వే మాత్రమే. ఈ సర్వే ఎంత దారుణంగా ఉంటుందో చూస్తే రేటింగ్స్ మీద కొద్దిపాటి గౌరవం కూడా మిగలదు. దేశం మొత్తం మీద 12 కోట్లకు పైగా కేబుల్ కనెక్షన్లు ఉంటే కనీసం 12వేల ఇళ్లు కూడా ఈ సర్వే లో లేవు. అంటే పదివేల ఇళ్లలో ఒకటి చొప్పున మాత్రమే సర్వే చేసి దాన్నే ప్రేక్షకుల అభిప్రాయంగా చెబుతున్నారు. 120 కోట్ల జనాభాలో 50 వేల లోపు మంది అభిప్రాయమే రేటింగ్ అవుతోంది. అంటే పాతిక వేలమందిలో ఒకరిని లెక్కపెడుతున్నారన్నమాట. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ఇక్కడున్న కోటికిపైగా కనెక్షన్లలో 1200 ఇళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే , ఇంటికి ఐదుగురి చొప్పున దాదాపు 6 వేల మందిని సర్వే చేస్తున్నారు. ఈ లెక్కలనే మనం ప్రేక్షకుల తీర్పుగా చాటుకుంటున్నాం.

సర్వే పధ్ధతి కూడా అయోమయమే. ఆంధ్ర ప్రదేశ్ లో పట్టణాలను మూడు రకాలుగా విభజించారు. మొదటిది హైదరాబాద్ నగరం. ఆ తరువాత విభాగంలోకి విశాఖపట్నం, విజయవాడ నగరాలొస్తాయి. ఈ మూడు నగరాలు కాకుండా పది పట్టణాలు కూడా రేటింగ్ పరిశీలనలో ఉన్నాయి. వీటి జాబితా రహస్యమని టామ్ సంస్థ చెబుతుంది గాని ఇది బహిరంగ రహస్యమే. అన్ని చానల్స్ కూ ఈ పట్టణాలు తెలుసు. అందుకే అక్కడ చానల్ తప్పనిసరిగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ అయితే రకరకాల కార్యక్రమాల ప్రిలిమినరీ సెలక్షన్స్ కు ఈ పట్టణాలనే ఎంచుకుంటాయి. న్యూస్ చానల్స్ కూడా ఆయా పట్టణాల వార్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. అక్కడి ఎమ్ ఎస్ ఓ ( చానల్స్ పంపిణీదారుడు ) కు క్యారేజ్ ఫీజు చెల్లిస్తాయి. వీటితో బాటు అక్కడ ఎవరెవరి ఇళ్లలో మీటర్లు పెట్టారో తెలుసుకుని తగిన ” జాగ్రత్తలు ” తీసుకుంటారని కూడా చెబుతారు గాని స్పష్టంగా అది నిరూపించటం కష్టం కాబట్టి ఆ విమర్శల జోలికి వెళ్ళనక్కర్లేదు.

ఇక లెక్కింపు విషయానికొస్తే, ఈ ఎంపిక చేసిన ఇళ్లలో పీపుల్స్ మీటర్ ఏర్పాటు చేస్తారు. దీన్ని ఒక రిమోట్ తో అనుసంధానం చేస్తారు. ఎవరైనా టీవీ ఆన్ చేయాలంటే ఈ మీటర్ మీద తమకు సంబంధించిన బటన్ నొక్కాలి. స్త్రీపురుషులకు వేరువేరు బటన్స్ ఉంటాయి. వయసులను బట్టి కూడా బటన్స్ మారతాయి. ఎవరైనా టీవీ దగ్గరనుంచి పక్కకి వెళ్ళిపోవాలంటే వాళ్ల బటన్ ఆప్ చేసి వెళ్ళాలి. ఆ విధంగా ఎవరెవరు ఎంత సేపు ఏ చానల్ చూశారో బరోడాలోని టామ్ కార్యాలయ రికార్డులలో నమోదవుతుంది. ” అందరూ అంత కచ్చితంగా టీవీ చూసేముందూ, అక్కడినుంచి వెళ్ళేముందూ బటన్ నొక్కుతారా “ లాంటి ధర్మసందేహాలకిక్కడ తావు లేదు. లక్షలోపు జనాభా ఉన్న మండలకేంద్రాలూ, గ్రామపంచాయితీలూ లెక్కకు రావా అంటే రావన్నదే సమాధానం. సగం జనాభా అభిప్రాయాలు లెక్కలోకి తీసుకోకుండా ఇది సరైన సర్వే ఎలా అవుతుందనేది జవాబుదొరకని ప్రశ్న.


టామ్ రేటింగ్స్ మీద ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. అతి తక్కువ శాంపిల్స్ తో రూపొందించే నివేదికలు సమగ్రంగా ఉండే అవకాశమే లేదు. అయినా సరే టామ్ దగ్గర ఒక రెడీమేడ్ గడసరి సమాధానం ఉండనే ఉంది. రక్తపరీక్ష చేయటానికి ఎంత రక్తమ్ తీస్తారన్న ఎదురు ప్రశ్నే వాళ్ళ సమాధానం. భిన్నమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న భారతదేశంలో ఏకరూపత ఉండదని తెలిసినా ఇదే బుకాయింపు. అసలు కారణం ఏమిటంటే, రేటింగ్స్ లెక్కించటానికి ఇళ్లలో టీవీలకు బిగించే పీపుల్స్ మీటర్ ఖరీదు లక్షరూపాయలు. ఇప్పటికే దేశంలో పదివేల మీటర్లకు వంద కోట్లు ఖర్చుపెట్టిన టామ్ ఇంతకుమించి ఖర్చు వద్దనుకుంటోంది. రేటింగ్స్ నిర్ణయించే ఏకైక సంస్థ గనుక అందరినీ శాసించే స్థితిలో ఉండి గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది.

చివరికి చానల్స్ అన్నీ టీ ఆర్ పీ ( టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ ) చట్రంలో ఇరుక్కు పోయాయి. మొత్తం టీవీ పరిశ్రమనే శాసించే స్థానంలో రేటింగ్స్ స్థిరపడ్డాయి. చానల్స్ కూడా మంచి రేటింగ్ వస్తే ఆనందించటం, రాకపోతే రేటింగ్స్ ని తిట్టుకుంటూ టామ్ ని విలన్ గా చిత్రీకరించటమే ఇప్పటిదాకా చూశాం. అయితే, ప్రత్యామ్నాయ వ్యవస్థ మీద దృష్టి పెట్టటంతో బాటు టామ్ పనితీరుమీద పర్యవేక్షణ ఉందాలన్న కోణంలో ఇప్పుడు చర్చ మొదలైంది. ఒకే రేటింగ్ ఏజెన్సీ సరిపోతుందా, ఎక్కువ దేశాల్లో ఉన్నట్టు కనీసం రెండు ఉండాలా అనేది కూడా ఇప్పటి చర్చలో భాగమే. టీవీ రేటింగ్స్ లెక్కించే టామ్ మీద విమర్శలు భారతదేశానికే పరిమితం కాలేదు.అమెరికాలో టామ్ మాతృ సంస్థ ఏసీ నీల్సెన్ కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కోక తప్పలేదు. ఏసీ నీల్సెన్ గుత్తాధిపత్యానికి అక్కడి మరో సంస్థ టీ ఎన్ ఎస్ బ్రేక్ వేసింది. ఒక్కసారిగా ఏసీ నీల్సెన్ అరాచకాలు వెలుగు చూడటంతో ఎన్నో కోర్టుకేసులు ఎదుర్కోవలసి వచ్చింది.

అమెరికాలో మీడియా రేటింగ్స్ కౌన్సిల్ ఉంది.అది రేటింగ్స్ తీసే క్రమాన్ని పర్యవేక్షిస్తుంది. భారత్ లో మాత్రం అలాంతి వ్యవస్థ ఏదీ లేదు. ట్రాయ్ ఎప్పుడు ఏ విశయంలో జోక్యం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఏయే అంశాలలో దాని పాత్ర ఉంటుందో ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు. కార్యక్రమాలకు సంబంధించినంతవరకు తన ప్రమేయం ఎంతమాత్రమూ ఉండదని ట్రాయ్ చెబుతుంది. ఇది సాంకేతిక మైన అంశం కాదుగనుక పట్టించుకోనంటుంది. ఈ రేటింగ్స్ ఆధారంగానే కార్యక్రమాలు తయారవుతున్నాయి కాబట్టి సమాచార ప్రసారాల శాఖ పరిధిలోనివని మరో వాదన. ప్రకటనకర్తలు, యాడ్ ఏజెన్సీలు, చానల్స్ కలసి అంగీకరించి ఏర్పాటుచేసుకున్న ఈ వ్యవస్థ మీద అభ్యంతరాలుంటే వాళ్ళే సరి చేసుకోవాలని ట్రాయ్ సూచిస్తోంది.మరో వైపు సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ కూడా చేతులెత్తేసింది. ఒక దశలో అప్పటి సమాచార కార్యదర్శి అరోరా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ” మియా బీవీ రాజీ హై తో క్యా కరేగా హాజీ ” అన్నారు. అంటే, ఇది కేవలం ప్రకటనదారులకూ, సంస్థలకూ, చానల్స్ కూ సంబంధించిన వ్యవహారంగానే ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

అయితే ప్రబుత్వం చెబుతున్నట్టుగా ఇది నిజంగా కేవలం మార్కెట్ కి సంబంధించిన సమస్యేనా ? రేటింగ్స్ ని ప్రజాదరణగా అర్థం చేసుకోవటమే తప్పన్న విషయాన్ని ప్రభుత్వమే పట్టించుకోకపోతే చౌకబారు కార్యక్రమాలతో ప్రేక్షకులు ఇబ్బంది పడాలా ? సెక్స్, క్రైమ్ లాంటి కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పుడు చాలామంది ఆసక్తితో చూడవచ్చు. ఆ తరువాత అలాంటి కార్యక్రమాలు మంచివి కావనే అభిప్రాయానికి రావచ్చు.అంతమాత్రాన ఆ కార్యక్రమాలకు ప్రజాదరణ ఉన్నట్టు భావించటం సమంజసం కాదు. చూస్తే తప్ప మంచో చెడో తెలియనప్పుడు తీరా చూశారు కాబట్టి మంచి కార్యక్రమమనే నిర్ధారణకు రావటం మీద విమర్శలొస్తున్నాయి. కేవలం రేటింగ్ వచ్చినంత మాత్రాన అది మంచి కార్యక్రమం అనుకోవటానికి వీల్లేదు. దురదృష్టవశాత్తూ అలా అనుకోవటం వల్లనే మిగిలిన చానల్స్ కూడా అటువంటి కార్యక్రమాన్నే ప్రసారం చెయ్యాలని తహతహలాడుతున్నాయి. కనీసం ప్రయోగాత్మకంగానైనా మంచి కార్యక్రమాలు అందించే ప్రయత్నం చేయటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే చానల్స్ కంటే ప్రకటనకర్తలే కాస్త బాధ్యతతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. రేటింగ్స్ ఎక్కువ వస్తున్నప్పటికీ క్రైమ్ కార్యక్రమాలకు ప్రకటనలు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. ప్రకటనకర్తలకు సహాయ పడాల్సిన రేటింగ్స్ ఇప్పుడు కార్యక్రమాల రూపకల్పనకు మార్గదర్శనం చేస్తున్నాయి. ఆ మాట కొస్తే , యాడ్ ఏజెన్సీల కంటే చానల్స్ ఎక్కువగా రేటింగ్స్ ని వాడుకుంటున్నాయేమో అనిపిస్తుంది.

మరో సారి రేటింగ్స్ తీరు గమనిస్తే, గ్రామీణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవటం లేదని టామ్ స్వయంగా అంగీకరిస్తోంది. లక్షలోపు జనాభా ఉన్న ప్రదేశాలను పట్టించుకోదు. దీన్ని బట్టి చానల్స్ కూడా గ్రామీణప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాల గురించి ఆలోచించటమే అనవసరమనే అభిప్రాయానికొచ్చాయి. అంతెందుకు.. చానల్స్ ఉపయోగించే భాష విషయంలోనూ అదే ధోరణి కనిపిస్తోంది. ఇంగ్లిష్ పదాలు అలవోకగా దొర్లిస్తూ పట్టణప్రాంత ప్రజలు ఉపయోగించే భాషనే చానల్స్ ఎంచుకోవటానికి కారణమూ రేటింగ్స్ లెక్కించే విధానమే. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ తమ కార్యక్రమాలలో ప్రేక్షకులకు భాగస్వామ్యం కల్పించాలనుకుంటే రేటింగ్స్ లెక్కించే పట్టణాలనే ఎంచుకుంటాయి. అక్కడి ప్రేక్షకుల దృష్టిలో పడాలన్న ఆశే అందుకు కారణం. న్యూస్ చానల్స్ అయితే రేటింగ్ పట్టణాల వార్తలౌ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం, అటువంటి “కీలక పట్టణాల” లో గట్టి రిపోర్టర్లను నియమించటం రహస్యమేమీ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదా, లేదా? ఇది కేవలం చానల్స్,అడ్వర్టైజర్, యాడ్ ఏజెన్సీ సమస్య మాత్రమేనా ?

రేటింగ్స్ లెక్కించటమనేది ఒకే సంస్థ చేతిలో ఉండటం కూడా రేటింగ్స్ విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఈ మధ్యనే ఎ మాప్ అనే సంస్థ వచ్చింది. ఇది టామ్ లాగా వారానికొకసారి కాకుండా ఏ రోజుకారోజు, ఇంకా కావాలంటే ఎప్పటికప్పుడు ఆన్‍లైన్ లో రేటింగ్స్ ఇస్తానంటోంది. అదే జరిగితే న్యూస్ చానల్స్ ప్రేక్షకులను రాబట్టుకోవటానికి ఎప్పటికప్పుడు ఎన్ని రకాల అవలక్షణాలు నేర్చుకుంటాయో ఊహకు అందదు. ఈ పరిస్థితుల్లో సాంకేతికత ఎక్కువగా ఉన్న రేటింగ్స్ ను పక్కన బెట్టి కార్యక్రమాల నాణ్యత మీద సర్వే జరిపించటం మంచిది. చానల్స్ కూడా పరోక్షంగా ఇదే కోరుకుంటున్నాయి. రేటింగ్స్ ను ప్రభుత్వం నియంత్రించ లేకపోతే ఎక్కువ నష్టపోయేది ప్రజలే. సమాచార శాఖామంత్రి చెబుతున్న రేటింగ్స్ కమిషన్ నిజంగా ఏర్పాటై రేటింగ్స్ లో లొసుగులు తొలగించి కార్యక్రమాల నాణ్యతకు రేటింగ్ ఇస్తే ప్రేక్షకులు సంతోషిస్తారు.
Source :- http://bhavanarayana.co.tv లోనిది

No comments: